ప్రైవేట్ ట్యూషన్లపై నిఘా ప్రత్యేక తనిఖీ అధికారులు నియామకం

- January 25, 2017 , by Maagulf
ప్రైవేట్ ట్యూషన్లపై నిఘా ప్రత్యేక తనిఖీ అధికారులు నియామకం

ప్రజలు తమ పిల్లలను  ప్రైవేట్ ట్యూషన్లకు పంపించడం ఇక చట్టాన్ని అతిక్రమించినట్లే !  వీటిని నియంత్రించేందుకు విద్యా మంత్రిత్వశాఖ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తనిఖీ అధికారులను నియమించి వారికి న్యాయ అధికారాలతో సహా ఏర్పాటుచేసింది. మంత్రిత్వశాఖలోని పబ్లిక్ రిలేషన్స్ విభాగ డైరెక్టర్ హసన్ అల్ ముహమ్మదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ , ప్రైవేట్ ట్యూషన్లను చెప్పడం చట్టం నిషేధించిందని వివరించారు.అంతేకాక, వార్తాపత్రికలు సైతం  ప్రైవేటు ట్యూషన్లు గురించి ప్రకటనలు తీసుకునేందుకు అనుమతి లేదు.ఈ సంవత్సరం ట్యూషన్ ఫీజు పెంచడానికి ఇప్పుడు వరకు  ఏ పాఠశాలకు అనుమతి మంజూరు కాలేదని ఆయన తెలిపారు. పాఠశాలలు కనుక మరింత ఫీజు పెంచడానికి అనుమతి కోరినట్లైతే, ఆ నిర్ణయం మార్చి1 వ తేదీ తర్వాత వెలువరిస్తారు.పలువురు తల్లిదండ్రులకు పాఠశాలల నుండి ఫీజు గురించి సమాచారంసందేశాలను అందుకున్నామని మంత్రిత్వశాఖకు ఎన్నో ఫిర్యాదులు నమోదు చేస్తున్నట్లు ఆయన ఉదహరించారు.అధికారిక ఫీజు పెరుగుదలకు సంబంధించి  ప్రత్యేక విధానాలు లోబడి పాఠశాల యాజమాన్యాలు  వ్యవహరించాలని ఒకవేళ  పాఠశాలలు చట్టబద్ధంగా పెరుగుదల కనుక ఉంటె  అందుకు తగిన  వెనుక కారణాలను వివరించాలని అవి  నిబద్ధమై ఉండాలని ఆయన అన్నారు. కేవలం అర్హమైన పాఠశాలలకు మంజూరు అనుమతి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com