ప్రైవేట్ ట్యూషన్లపై నిఘా ప్రత్యేక తనిఖీ అధికారులు నియామకం
- January 25, 2017
ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ ట్యూషన్లకు పంపించడం ఇక చట్టాన్ని అతిక్రమించినట్లే ! వీటిని నియంత్రించేందుకు విద్యా మంత్రిత్వశాఖ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తనిఖీ అధికారులను నియమించి వారికి న్యాయ అధికారాలతో సహా ఏర్పాటుచేసింది. మంత్రిత్వశాఖలోని పబ్లిక్ రిలేషన్స్ విభాగ డైరెక్టర్ హసన్ అల్ ముహమ్మదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ , ప్రైవేట్ ట్యూషన్లను చెప్పడం చట్టం నిషేధించిందని వివరించారు.అంతేకాక, వార్తాపత్రికలు సైతం ప్రైవేటు ట్యూషన్లు గురించి ప్రకటనలు తీసుకునేందుకు అనుమతి లేదు.ఈ సంవత్సరం ట్యూషన్ ఫీజు పెంచడానికి ఇప్పుడు వరకు ఏ పాఠశాలకు అనుమతి మంజూరు కాలేదని ఆయన తెలిపారు. పాఠశాలలు కనుక మరింత ఫీజు పెంచడానికి అనుమతి కోరినట్లైతే, ఆ నిర్ణయం మార్చి1 వ తేదీ తర్వాత వెలువరిస్తారు.పలువురు తల్లిదండ్రులకు పాఠశాలల నుండి ఫీజు గురించి సమాచారంసందేశాలను అందుకున్నామని మంత్రిత్వశాఖకు ఎన్నో ఫిర్యాదులు నమోదు చేస్తున్నట్లు ఆయన ఉదహరించారు.అధికారిక ఫీజు పెరుగుదలకు సంబంధించి ప్రత్యేక విధానాలు లోబడి పాఠశాల యాజమాన్యాలు వ్యవహరించాలని ఒకవేళ పాఠశాలలు చట్టబద్ధంగా పెరుగుదల కనుక ఉంటె అందుకు తగిన వెనుక కారణాలను వివరించాలని అవి నిబద్ధమై ఉండాలని ఆయన అన్నారు. కేవలం అర్హమైన పాఠశాలలకు మంజూరు అనుమతి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







