ప్రముఖ హోటల్‌పై ఉగ్రదాడి..15 మంది మృతి

- January 25, 2017 , by Maagulf
ప్రముఖ హోటల్‌పై ఉగ్రదాడి..15 మంది మృతి

ఓ ప్రముఖ హోటల్‌పై బుధవారం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. సొమాలియా పార్లమెంట్ సమీపంలోని డేయా హోటల్ గేట్ వద్ద బుధవారం తొలుత ఓ కారు బాంబు పేలింది. అనంతరం ఆయుధాలు ధరించిన కొందరు సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు. హోటల్‌ భవంతిలోకి ప్రవేశించేందుకు యత్నించారు.

 
ఇంతలో అంబులెన్స్‌లు, మీడియా అక్కడికి రాగా మరో కారు బాంబ్ పేలింది. ఐదుగురు పౌరులు చనిపోగా పలువురు మీడియా సిబ్బంది గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అల్ ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ షాబాబ్ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com