రూ.5కే భోజనం.. 5లక్షల బీమా.. 25లక్షల జాబ్స్...
- January 27, 2017
రొటీన్ పాలిటిక్స్కు భిన్నంగా బరిలోకి దిగి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీ పై కన్నేసింది. లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలు సాధించిన ఊపుతో అకాలీదళ్- భాజపా కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీకి పోటీగా ఫిబ్రవరి 4న 117 స్థానాలకు జరుగనున్న ఎన్నికల బరిలో దూసుకుపోతోంది. ఆపార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పంజాబ్ ప్రజలపై హామీల వర్షం కురిపించింది.
అధికారం చేపట్టిన నెలలో రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై నిషేధం, బాధితులను ఆరునెలల్లో మామూలు మనుషులు చేయడం.. యువతకు 25లక్షల ఉద్యోగావకాశాల కల్పన, విదేశీ ఉద్యోగాల శిక్షణకు ఫారిన్ ఎంప్లాయిమెంట్ బోర్డు ఏర్పాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.5లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా, ఆస్తి పన్ను రద్దు, 400 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగంపై కరెంట్ బిల్లు సగానికి తగ్గింపు, అన్ని జిల్లా, సబ్ డివిజినల్ టౌన్లలో ఆమ్ఆద్మీ క్యాంటీన్లు నెలకొల్పి రూ.5కే భోజనం, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు అందించే పింఛన్లను రూ.500 నుంచి రూ.2500కి పెంపు, వీటితో పాటు రైతులకు రుణమాఫీ, ఆప్కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు బుగ్గ కార్లు వినియోగించకపోవడం వంటి చర్యలు చేపడతామని పంజాబ్ ఓటర్లకు హామీ ఇస్తోంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







