కుప్పకూలిన భవంతి, 4మంది మృతి
- February 01, 2017
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాజ్మాలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సుమారు వంద మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని భద్రతా సిబ్బంది రక్షించారు. మహిళలు, చిన్నారులు సహా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రిలో నాణ్యతా లోపం వలనే ప్రమాదం జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ భవనం కూలడంతో సమీపంలోని రెండు ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రమాదానికి గురైన భవనం సమాజ్వాదీ పార్టీ నేతకు సంబంధించినదని స్థానికులు తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







