అక్రమ లావాదేవీలు: ఖతార్ బ్యాంకర్పై కేసు
- February 02, 2017
దోహాకి చెందిన ప్రముఖ బ్యాంకర్, బోగస్ కంపెనీలను సృష్టించి అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నట్లు గుర్తించి ఆయనపై కేసు నమోదు చేశారు. బోగస్ కంపెనీల పేరుతో ఒప్పందాలు కుదుర్చుకుని, పెద్ద మొత్తంలో సొమ్ముల్ని తన బ్యాంక్ అకౌంట్లోకి మార్చుకున్నాడాయన. పెద్ద మొత్తంలో సొమ్ములు, వ్యక్తిగత అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కావడంతో ఈ విషయం వెలుగు చూసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ మేరకు ఆయనపై అభియోగాలు నమోదు చేసింది. అక్రమ లావాదేవీల కోసం నిందితుడు ఫోర్జరీ డాక్యుమెంట్లను వినియోగించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. తాను పనిచేస్తున్న సంస్థలపై కుట్రపూరితంగా వ్యవహరించినట్లుగా కూడా అభియోగాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ నమోదు చేసింది. డెన్మార్క్లో ఉందని చెబుతోన్న బోగస్ కంపెనీ కోసం 636,683 డాలర్లు, ఆస్ట్రేలియా ఉందని చెబుతోన్న మరో ఫేక్ కంపెనీ కోసం 212,483 డాలర్లు, యూఏఈలో ఉందని చెబుతోన్న కంపెనీ తరఫున 434,766 డాలర్లు తన అకౌంట్లోకి మార్చేందుకు ప్రయత్నించాడు. ఆయా కంపెనీలకు అక్రమంగా నిధుల మళ్ళింపు జరిగినట్లుగా విచారణలో తేలింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







