అక్రమ లావాదేవీలు: ఖతార్ బ్యాంకర్పై కేసు
- February 02, 2017
దోహాకి చెందిన ప్రముఖ బ్యాంకర్, బోగస్ కంపెనీలను సృష్టించి అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నట్లు గుర్తించి ఆయనపై కేసు నమోదు చేశారు. బోగస్ కంపెనీల పేరుతో ఒప్పందాలు కుదుర్చుకుని, పెద్ద మొత్తంలో సొమ్ముల్ని తన బ్యాంక్ అకౌంట్లోకి మార్చుకున్నాడాయన. పెద్ద మొత్తంలో సొమ్ములు, వ్యక్తిగత అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కావడంతో ఈ విషయం వెలుగు చూసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ మేరకు ఆయనపై అభియోగాలు నమోదు చేసింది. అక్రమ లావాదేవీల కోసం నిందితుడు ఫోర్జరీ డాక్యుమెంట్లను వినియోగించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. తాను పనిచేస్తున్న సంస్థలపై కుట్రపూరితంగా వ్యవహరించినట్లుగా కూడా అభియోగాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ నమోదు చేసింది. డెన్మార్క్లో ఉందని చెబుతోన్న బోగస్ కంపెనీ కోసం 636,683 డాలర్లు, ఆస్ట్రేలియా ఉందని చెబుతోన్న మరో ఫేక్ కంపెనీ కోసం 212,483 డాలర్లు, యూఏఈలో ఉందని చెబుతోన్న కంపెనీ తరఫున 434,766 డాలర్లు తన అకౌంట్లోకి మార్చేందుకు ప్రయత్నించాడు. ఆయా కంపెనీలకు అక్రమంగా నిధుల మళ్ళింపు జరిగినట్లుగా విచారణలో తేలింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









