మరో అవకాశం పీఎఫ్ నమోదుకు...
- February 02, 2017
హైదరాబాద్: ఉద్యోగులు, కార్మికులు భవిష్యనిధి సభ్యులుగా ప్రయోజనాలను పొందేందుకు ఈపీఎఫ్వో 'ఉద్యోగుల నమోదు ప్రచారం- 2017' కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ ఎంఎస్కేవీవీ సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం మార్చి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2009 ఏప్రిల్ 1 నుంచి 2016 డిసెంబర్ 31 వరకు ఉద్యోగులు, కార్మికులుగా చేరి వివిధ కారణాలతో భవిష్యనిధి సదుపాయాలు పొందనివారు, ఆయా యాజమాన్యాలు స్వచ్ఛం దంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు నమోదు చేసుకోనివారు అపరాధ రుసుము కింద ఏడాదికి రూ.1 చొప్పున నామమాత్రంగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







