భారతీయులు, ముస్లింలు, యూదులకు భయోత్పాతం కలిగించే మరో పరిణామం అమెరికాలో...

- February 04, 2017 , by Maagulf
భారతీయులు, ముస్లింలు, యూదులకు భయోత్పాతం కలిగించే మరో పరిణామం అమెరికాలో...

అమెరికాలో ఒక కుటుంబానికి హెచ్చరిక
హోస్టన్‌, ఫిబ్రవరి 4: భారతీయులు, ముస్లింలు, యూదులకు భయోత్పాతం కలిగించే మరో పరిణామం అమెరికాలో చోటు చేసుకుంది. హోస్టన్‌ శివారున ఫోర్ట్‌ బెండ్‌ జిల్లాలో శనివారం ఓ కుటుంబం లేచీలేవగానే ఇంటి తలుపుపై ఆగంతకులు పెద్ద అక్షరాలతో ఒక ఉత్తరం రాసి అంటించారు. ''ముస్లింలు, భారతీయులు, యూదులను గెంటేస్తాం. ఇక్కడి నుంచి పొండి'' అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉండడంతో వారంతా వణికిపోయారు. ''డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ శ్వేత రాజ్యానికి దేవుడిచ్చిన గొప్ప వరం. ముస్లింలు, భారతీయులు, యూదులను ఇక్కడి నుంచి గెంటేస్తాం'' అని రాసి ఉంది.
ఈ ప్రాంతంలో ఎక్కువగా దక్షిణాసియా ప్రజలు నివసిస్తారు. ఒక వారం వ్యవధిలోనే అమెరికాలో వలసవాదులను భయాందోళనలకు గురిచేస్తూ ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి. దీంతో శ్వేతజాతేతరుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com