భారతీయులు, ముస్లింలు, యూదులకు భయోత్పాతం కలిగించే మరో పరిణామం అమెరికాలో...
- February 04, 2017
అమెరికాలో ఒక కుటుంబానికి హెచ్చరిక
హోస్టన్, ఫిబ్రవరి 4: భారతీయులు, ముస్లింలు, యూదులకు భయోత్పాతం కలిగించే మరో పరిణామం అమెరికాలో చోటు చేసుకుంది. హోస్టన్ శివారున ఫోర్ట్ బెండ్ జిల్లాలో శనివారం ఓ కుటుంబం లేచీలేవగానే ఇంటి తలుపుపై ఆగంతకులు పెద్ద అక్షరాలతో ఒక ఉత్తరం రాసి అంటించారు. ''ముస్లింలు, భారతీయులు, యూదులను గెంటేస్తాం. ఇక్కడి నుంచి పొండి'' అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉండడంతో వారంతా వణికిపోయారు. ''డోనాల్డ్ ట్రంప్ ఈ శ్వేత రాజ్యానికి దేవుడిచ్చిన గొప్ప వరం. ముస్లింలు, భారతీయులు, యూదులను ఇక్కడి నుంచి గెంటేస్తాం'' అని రాసి ఉంది.
ఈ ప్రాంతంలో ఎక్కువగా దక్షిణాసియా ప్రజలు నివసిస్తారు. ఒక వారం వ్యవధిలోనే అమెరికాలో వలసవాదులను భయాందోళనలకు గురిచేస్తూ ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి. దీంతో శ్వేతజాతేతరుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







