ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన విమాన ప్రయాణం చేసిన ఖతార్ ఎయిర్వేస్
- February 05, 2017
వెల్లింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన విమాన ప్రయాణం చేసిన ఖతార్ ఎయిర్వేస్ విమానం సోమవారం న్యూజిలాండ్ చేరుకుంది. ఖతార్లోని దోహా నుంచి బయలుదేరిన ఈ విమానం 14,535 కిలోమీటర్లు ప్రయాణించి న్యూజిలాండ్లోని ఆక్లాండ్కు చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో 16 గంటల 23 నిమిషాలు నాన్స్టాప్గా ప్రయాణించింది. అనుకున్న సమయం కంటే అయిదు నిమిషాల ముందే ఆక్లాండ్కు చేరుకున్నట్లు ఖతార్ ఎయిర్వేస్ తెలిపింది.
లాంగ్ రేంజ్ బోయింగ్ 777-200ఎల్ఆర్ విమానం ఈ ప్రయాణ సమయంలో 10 టైమ్జోన్లు దాటింది. విమానంలో నలుగురు పైలట్లు, 15 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో సిబ్బంది 1100 కప్పుల టీ, కాఫీ, 2వేల కూల్డ్రింక్స్, 1036 మీల్స్ సర్వ్ చేశారట. గత ఏడాది మార్చిలో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసే నాన్స్టాప్ కమర్షియల్ విమానంగా దుబాయి నుంచి ఆక్లాండ్కు సర్వీసు ప్రారంభించింది. వీటి మధ్య 14,200కిలోమీటర్ల దూరం. ఎయిరిండియా కూడా దిల్లీ నుంచి అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కో వరకు నాన్స్టాప్ విమానం నడుపుతోంది. అయితే ఖతార్ ఎయిర్వేస్ దోహ-ఆక్లాండ్ సర్వీసుతో వీటిని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ విమాన ప్రయాణంగా రికార్డు సృష్టించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









