ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా వున్నా కళ్యాణ్ రామ్...
- February 06, 2017
తారక్తో ఫస్ట్ టైం మూవీ ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా వున్నాడు కళ్యాణ్ రామ్. ఈ మూవీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.. టాప్ టెక్నీషియన్లని సెలెక్ట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ తొలిసారి ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో రాశి ఖన్నా ఓ హీరోయిన్గా చేస్తోంది. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న స్టార్ట్ కానుంది.
ఇక 'ఇజం' తరువాత తను చేయబోయే మూవీ గురించి కూడా కథలు విన్న కళ్యాణ్ రామ్ ఓ స్టోరీ ఫైనల్ చేశాడట. ఇంతకుముందు 'ప్రేమ.. ఇష్క్.. కాదల్', నారా రోహిత్తో 'సావిత్రి' లాంటి సినిమాలు చేసిన యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని చెప్పిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కళ్యాణ్ ఇంతవరకు ట్రై చేయని కొత్త జానర్లో ఈ మూవీ వుండబోతోందట.
తారక్ మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయిన తరువాత పవన్తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడట కళ్యాణ్ రామ్.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







