400 ఎకరాల విస్తీర్ణంలో వైద్య పరికరాల తయారీ పార్క్..
- February 06, 2017
హైదరాబాద్: నగర శివారులోని 400 ఎకరాల విస్తీర్ణంలో వైద్య పరికరాల తయారీ పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ పార్క్ ద్వారా దాదాపు 70శాతం వైద్య పరికరాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయనున్నట్లు స్పష్టం చేశారు. శామీర్పేట జీనోమ్ వ్యాలీలోని బయోలాజికల్ ఈ-లిమిటెడ్ కంపెనీ రూ.300కోట్ల వ్యయంతో సుమారు 29 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న 'బయోలాజికల్ సెజ్'కు కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే జీనోమ్ వ్యాలీలోని ఆరోగ్య కేంద్రంతో పాటు క్యాటిలిస్ట్ హబ్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ తరహాలోనే ఫార్మా రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే వ్యాక్సిన్లతో 20శాతం హైదరాబాద్ నుంచే తయారుకావడం రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. జీనోమ్ వ్యాలీలో పనిచేసే ఉద్యోగుల సౌకర్యార్థం వచ్చే రెండేళ్లలో తూముకుంట వరకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







