400 ఎకరాల విస్తీర్ణంలో వైద్య పరికరాల తయారీ పార్క్‌..

- February 06, 2017 , by Maagulf
400 ఎకరాల విస్తీర్ణంలో వైద్య పరికరాల తయారీ పార్క్‌..

హైదరాబాద్‌: నగర శివారులోని 400 ఎకరాల విస్తీర్ణంలో వైద్య పరికరాల తయారీ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఈ పార్క్‌ ద్వారా దాదాపు 70శాతం వైద్య పరికరాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయనున్నట్లు స్పష్టం చేశారు. శామీర్‌పేట జీనోమ్‌ వ్యాలీలోని బయోలాజికల్‌ ఈ-లిమిటెడ్‌ కంపెనీ రూ.300కోట్ల వ్యయంతో సుమారు 29 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న 'బయోలాజికల్‌ సెజ్‌'కు కేటీఆర్‌ సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే జీనోమ్‌ వ్యాలీలోని ఆరోగ్య కేంద్రంతో పాటు క్యాటిలిస్ట్‌ హబ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఐటీ తరహాలోనే ఫార్మా రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే వ్యాక్సిన్లతో 20శాతం హైదరాబాద్‌ నుంచే తయారుకావడం రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. జీనోమ్‌ వ్యాలీలో పనిచేసే ఉద్యోగుల సౌకర్యార్థం వచ్చే రెండేళ్లలో తూముకుంట వరకు ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించనున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com