మొదలైన నాగచైతన్య కొత్త చిత్రం
- February 07, 2017'ప్రేమమ్', 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాలతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని నాగచైతన్య పరిణితి చెందిన నటనతో మంచి మార్కులే వేయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం లాంఛనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు ఎస్.ఎస్.రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, దగ్గుబాటి సురేశ్బాబు, కీరవాణి తదితరులు హాజరయ్యారు. నాగచైతన్య తన ట్విట్టర్ ఖాతా ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వారాహి చలన చిత్రం పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీకాంత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఫిబ్రవరి 21న నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం