నలుగురు ఉగ్రమూక హతం భారీ ఎన్కౌంటర్..
- February 11, 2017
జమ్మూకశ్మీర్లో చొరబడేందుకు మరోసారి ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. దీంతో కుల్గాం జిల్లాలోని యారిపుర-ఫ్రిజల్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతిచెందారు. ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుడు కూడా ఒకరు చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భద్రతాదళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందండంతో భద్రతాదళాలు రంగంలోకి దిగాయి.
యారిపుర-ఫ్రిజల్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఆపరేషన్ ప్రారంభించాయి. మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా గాయపడ్డారని, వారు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, కాల్పులు కొనసాగుతున్నాయని భద్రతా దళాలు తెలిపాయి.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









