మరో వరల్డ్ కప్ భారత్ ఖాతాలో...
- February 12, 2017
బెంగళూరు:అంధుల ట్వంటీ 20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ జట్టు టైటిల్ ను నిలబెట్టుకుంది. ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ ను మరోసారి ఎగురేసుకుపోయింది. పాకిస్తాన్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత్ జట్టు 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుని లీగ్ దశలో పాక్ పై ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. క్రితంసారి పాకిస్తాన్ ను ఓడించి కప్ ను సాధించిన భారత్ అదే పరంపరను కొనసాగించి తుది పోరులో తమకు తిరుగులేదని నిరూపించింది.
భారత్ ఆటగాళ్లలో ఓపెనర్ ప్రకాశ్ జయరామయ్య(99 నాటౌట్) మరోసారి విశేషంగా రాణించి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు.
అతనికి జతగా అజయ్ కుమార్ రెడ్డి(43) ఆకట్టుకున్నాడు. మరొక ఆటగాడు కేతన్ పటేల్(26) రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









