మరో వరల్డ్ కప్ భారత్ ఖాతాలో...

- February 12, 2017 , by Maagulf
మరో వరల్డ్ కప్ భారత్ ఖాతాలో...

బెంగళూరు:అంధుల ట్వంటీ 20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ జట్టు టైటిల్ ను నిలబెట్టుకుంది. ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ ను మరోసారి ఎగురేసుకుపోయింది. పాకిస్తాన్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత్ జట్టు 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుని లీగ్ దశలో పాక్ పై ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. క్రితంసారి పాకిస్తాన్ ను ఓడించి కప్ ను సాధించిన భారత్ అదే పరంపరను కొనసాగించి తుది పోరులో తమకు తిరుగులేదని నిరూపించింది.

భారత్ ఆటగాళ్లలో ఓపెనర్ ప్రకాశ్ జయరామయ్య(99 నాటౌట్) మరోసారి విశేషంగా రాణించి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు.
అతనికి జతగా అజయ్ కుమార్ రెడ్డి(43) ఆకట్టుకున్నాడు. మరొక ఆటగాడు కేతన్ పటేల్(26) రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com