నలుగురు హీరోల 'శమంతకమణి' సినిమా ప్రారంభం
- February 12, 2017
నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది, సుధీర్బాబు కీలక పాత్రధారులుగా భవ్య క్రియేషన్స పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'శమంతకమణి'. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ తులసీవనంలో ప్రారంభమైన ఈ చిత్రానికి శ్రీను వైట్ల క్లాప్నిచ్చారు. ఆనంద్ ప్రసాద్ కెమరా స్విచ్చాన చేశారు. రాజేంద్రప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఫేస్బుక్లో జాబ్ చేస్తున్నప్పుడు రాసుకున్న కథ ఇది. నలుగురు హీరోలతో చెయ్యాల్సిన కథ అని పలువురికి చెప్పినప్పుడు తెలుగులో నలుగురు హీరో కలిసి నటించడం సాధ్యం కాదన్నారు. నారా రోహిత, సందీప్ కిషన, ఆది, సుధీర్బాబుకు కథ చెప్పగానే అంగీకరించారు.
వినోదం ప్రధానంగా సాగే సినిమా ఇది'' అని అన్నారు. ''త్వరలో సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తాం. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళ్తాం'' అని నిర్మాత ఆనంద్ ప్రసాద్ తెలిపారు. ఎంగేజింగ్, ఎంటర్టైనమెంట్ ఉన్న సినిమా ఇదని హీరోలు చెప్పారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









