నలుగురు హీరోల 'శమంతకమణి' సినిమా ప్రారంభం
- February 12, 2017
నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది, సుధీర్బాబు కీలక పాత్రధారులుగా భవ్య క్రియేషన్స పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'శమంతకమణి'. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ తులసీవనంలో ప్రారంభమైన ఈ చిత్రానికి శ్రీను వైట్ల క్లాప్నిచ్చారు. ఆనంద్ ప్రసాద్ కెమరా స్విచ్చాన చేశారు. రాజేంద్రప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఫేస్బుక్లో జాబ్ చేస్తున్నప్పుడు రాసుకున్న కథ ఇది. నలుగురు హీరోలతో చెయ్యాల్సిన కథ అని పలువురికి చెప్పినప్పుడు తెలుగులో నలుగురు హీరో కలిసి నటించడం సాధ్యం కాదన్నారు. నారా రోహిత, సందీప్ కిషన, ఆది, సుధీర్బాబుకు కథ చెప్పగానే అంగీకరించారు.
వినోదం ప్రధానంగా సాగే సినిమా ఇది'' అని అన్నారు. ''త్వరలో సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తాం. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళ్తాం'' అని నిర్మాత ఆనంద్ ప్రసాద్ తెలిపారు. ఎంగేజింగ్, ఎంటర్టైనమెంట్ ఉన్న సినిమా ఇదని హీరోలు చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









