లాహోర్లో బాంబు పేలుడు, 10మంది మృతి
- February 13, 2017
పాకిస్థాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. సోమవారం సాయత్రం పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ లో అసెంబ్లీ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ దాడిలో సీనియర్ పోలీసు అధికారులతో సహా కనీసం పదిమంది మరణించనట్టు సమాచారం. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
నిరసనలు జరుగుతున్న ఈ ప్రాంతంలో పేలుడు పదర్ధాలు నింపిన వాహాన్ని పేల్చివేసినట్టు పాక్ మీడియా కథనం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఈ దాడి చేసింది ఎవరు? ఉగ్రవాదులు హస్తం ఉందా? వంటి విషయాలు తెలియాల్సి వుంది. గతేడాది లాహోర్ లోనే పబ్లిక్ పార్క్లో సంభవించిన బాంబు పేలుడులో దాదాపు 70 మంది మరణించారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









