ప్రభుత్వ రంగంలో విదేశీయులను తగ్గించడంలో కనికరం లేదన్న కువైట్ ఎంపీ...
- February 16, 2017
మనామా: విదేశీ కన్సల్టెంట్స్ ద్వారా నియామకాలు చెల్లవని మరియు ప్రస్తుత వాటి ఒప్పందాలు పునరుద్ధరించకుండా ఉండేలా మంత్రులపై ఒత్తిడి కొనసాగిస్తామని కువైట్ చట్ట రూపకర్తలు బుధవారం చెప్పారు.ప్రభుత్వరంగంలో పనిచేస్తున్న నిర్వాసితులు సంఖ్య గురించి నా ప్రశ్న చట్టసభలో సమర్పించానని, కానీ అత్యధిక స్థాయిలో మంత్రులు ఈ సమస్యపై ఏమాత్రం స్పందించడం లేదని ఎంపి అబ్దుల్ కరీం అల్ కందరి ఆవేదనతో చెప్పారు. "బహుశా మా నుండి కొన్ని పేర్లు దాచడానికి ప్రయత్నాలు ఉన్నాయి, కానీ నేను మేము కష్టమైనప్పటకీ కువైటీయుల కోసం పని చేస్తున్న వారి పేర్లను మీకు తెలియచేస్తామని భరోసా ఇస్తున్నామని ,కానీ కొందరు స్వదేశీయుల సమస్యలను పక్కన పెట్టారని చట్ట పార్లమెంటు సమావేశాలలో వివరించాడు. ప్రజా కార్యాలయాలు, సంస్థలు లేదా పాఠశాలలుప్రవాసీయుల ఉనికిని తీవ్రతను బహిర్గతం చేయాలని క్రమంలో లేని సంఖ్యలు మరియు పేర్లతో దిద్దుబాటు ఉండరాదని అల్ కందరి హెచ్చరించాడు.మేము 96.000 విదేశీయులు విద్యా మంత్రిత్వశాఖ ద్వారా ఉద్యోగులుగా అడిఫిక సంఖ్యలో నియమించబడ్డారని వారినే ఎందుకు అలా నియమించాల్సివచ్చిందో తెలుసుకునేందుకు వాస్తవమైన కారణాలు తెలుసు కోవాలనుకుంటున్నాం .ఇక్కడ కువైట్లో ఈ ప్రజలు వారి స్వదేశంలో ఎందుకని ఆయా ఉద్యోగాలలో ఎందుకు నియమించబడటం లేదో తెలుసుకోవడం ముఖ్యమని ఆయన అన్నారు. కొందరు మంత్రులు తమ కార్యాలయాల్లో విదేశీయులతో పని ఒప్పందాలు సైతం రద్దు చేసుకొన్నట్లు ఎంపీ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







