పోర్టుకి భూములిచ్చి ప్యాకేజీ పొందండి : మంత్రి కొల్లు రవీంద్ర

- February 16, 2017 , by Maagulf
పోర్టుకి భూములిచ్చి ప్యాకేజీ పొందండి : మంత్రి కొల్లు రవీంద్ర

పోర్టు నిర్మాణానికి రైతులు భూములిచ్చి ప్రభుత్వం నుంచి వచ్చే ప్యాకేజీని పొందాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం తపసిపూడి, మంగినపూడి గ్రామాల్లో పర్యటించి పోర్టు నిర్మాణంపై రైతులకు అవగాహన కల్పించారు. తపసిపూడిలో ఇరవై మంది రైతులు, మంగినపూడిలో 25 మంది రైతులు భూములిస్తూ అంగీకార పత్రాలను మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మడ విసి వేణుగోపాలరెడ్డి, మచిలీపట్నం ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గోపు సత్యన్నారాయణ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com