పాక్‌లోని ప్రార్థనా మందిరంలో పేలుడు..

- February 16, 2017 , by Maagulf
పాక్‌లోని ప్రార్థనా మందిరంలో పేలుడు..

పాకిస్థాన్‌లోని సెహ్వాన్‌లో ఓ ప్రార్థనా మందిరంలో భారీ బాంబుపేలుడు సంభవించింది. లాల్ షాబాజ్ ఖలందర్ సూఫీ ప్రార్థనా మందిరం ఆవరణలో జరిగిన ఈ పేలుడులో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మరో వందమంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మందిర పరిసరాలు రక్తసిక్తమయ్యాయి. భక్తులు భయంతో పరుగులు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com