కతార్లో ఆహారపదార్ధాల పేకేజింగ్, లేబిలింగ్ పై సందేహాలు
- September 18, 2015
ఆహారపదార్ధాల పేకేజింగ్, లేబిలింగ్ పై కతార్ వినియోగదారుల్లో అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. దోహాలోని అనేక పెద్ద సూపర్ మార్కెట్లలో తయారుచేయబడి, విక్రయించబడే బ్రెడ్, ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ బాగ్ లలో ప్యాక్ చేయబడుతుంది, మరియు దానిపై ఉన్న అంతర్జాతీయ చిహ్నం, పాక్కెజింగ్ పదార్ధం సురక్షితమని తెలియజేస్తుంది. సెప్టంబర్ 2013 న, ప్రజారోగ్య శాఖ, ఆహారపదార్ధాలను పేక్ చేయడానికి పాలీ ఇథలీన్, వార్తాపత్రికలను, ఇతర కాగితాలను వాడటాన్ని నిరోధించింది. కానీ కొన్ని హైపర్ మార్కెట్లను సో దా చేసినపుడు, కొన్ని రకాల అరబిక్ బ్రెడ్ లపై కేవలం తయారీదారు పేరు, ఫోన్ నంబర్లు మాత్రమే ముద్రిచబడటం, చపాతీ వంటి కొన్ని పదార్ధాలపై వాడబడిన పదార్ధాల వివరాలు తప్ప, వాటి పోషకవిలువల గురించి తెలియక పోవడం వంటి అంశాలు గమనించారు. హమాద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) , ఒఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఛైర్మన్ - ప్రొఫెసర్ అబ్దుల్-బడీ-అబూ-సమ్రా ఇటీవల - ప్లాస్టిక్ కాగితాలను, ప్లాస్టిక్ డబ్బాలను వాడటం వలన రసాయనాలు పదార్ధాలలో కలిసే అవకాశముందని, ఇందుకై PVC ప్లాస్టిక్ ను వాడటం ఉత్తమమని తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







