హోం డెలివరీ పారాచూట్తో...
- February 16, 2017
ఇంటర్నెట్డెస్క్: సరకులను హోం డెలివరీ చేసేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సరికొత్త ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే డ్రోన్లతో డెలివరీ సేవలను ప్రారంభించిన ఆ సంస్థ.. ఇకపై గగనతలం నుంచి కస్టమర్ల ఇంటి గుమ్మం ముందు పార్శిళ్లను దించేందుకు పారాచూట్లను వినియోగించనుందట.
ప్రస్తుతం అమెజాన్ ప్రారంభించిన ‘డ్రోన్ డెలివరీ’ విధానంలో వినియోగదారుడి ఇంటి వద్ద డ్రోన్ లాండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే డ్రోన్లు గగనతలంలో ప్రయాణించడం కంటే లాండింగ్.. టేకాఫ్లకే ఎక్కువ ఇంధనం ఖర్చవుతుందట. దాంతో పాటు కొన్ని భద్రతా పరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట.
అందుకే డ్రోన్లతో రవాణా చేసి గగనతలం నుంచే సరకులను భద్రంగా కిందికి దించేందుకు పారాచూట్లను వినియోగించనున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
అయితే.. కిందికి వదిలాక గాలి ప్రవాహంతో పారాచూట్లు అటుఇటు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ సమస్యకూ పరిష్కారం కనుగొన్నట్లు అమెజాన్ తెలిపింది. పారాచూట్ కిందికి దిగేంత వరకు డ్రోన్ అక్కడే గాలిలో ఉండి గమనిస్తుందట. ఒకవేళ పారాచూట్ పక్కకు కదిలితే ప్రత్యేకంగా సిగ్నళ్లతో దాన్ని సరైన చోటే దిగేలా చేస్తుందట. అందుకు పారాచూట్లలోనూ ప్రత్యేకమైన వ్యవస్థ రూపొందించారట.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







