కార్ బాంబు పేలి 45 మంది మృతి బాగ్దాద్లో...
- February 16, 2017
బాగ్దాద్, ఫిబ్రవరి 16: ఇరాక్ రాజధాని బాగ్దాద్ పేలుళ్లతో దద్దరిల్లుతోంది. వరుసగా మూడోరోజు జరిగిన బాంబు దాడిలో 45 మంది మరణించగా, మరో 60 మంది దాకా గాయపడ్డారని బాగ్దాద్ ఆపరేషన్స్ కమాండ్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. దక్షిణ బాగ్దాద్లోని సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:15 నిమిషాలకు కారులో అమర్చిన బాంబు పేలింది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న 45 మంది పౌరులు మరణించారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా ప్రాంతం భీభత్సంగా మారింది. కాగా, ఐఎ్సకు చెందిన అనుబంధ సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
బాగ్దాద్లో ఇది వరుసగా మూడో పేలుడు. మంగళవారం కార్ బాంబు దాడిలో నలుగురు మరణించగా, బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!









