కార్ బాంబు పేలి 45 మంది మృతి బాగ్దాద్లో...
- February 16, 2017
బాగ్దాద్, ఫిబ్రవరి 16: ఇరాక్ రాజధాని బాగ్దాద్ పేలుళ్లతో దద్దరిల్లుతోంది. వరుసగా మూడోరోజు జరిగిన బాంబు దాడిలో 45 మంది మరణించగా, మరో 60 మంది దాకా గాయపడ్డారని బాగ్దాద్ ఆపరేషన్స్ కమాండ్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. దక్షిణ బాగ్దాద్లోని సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:15 నిమిషాలకు కారులో అమర్చిన బాంబు పేలింది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న 45 మంది పౌరులు మరణించారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా ప్రాంతం భీభత్సంగా మారింది. కాగా, ఐఎ్సకు చెందిన అనుబంధ సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
బాగ్దాద్లో ఇది వరుసగా మూడో పేలుడు. మంగళవారం కార్ బాంబు దాడిలో నలుగురు మరణించగా, బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







