ఏపీ రాజధాని అమరావతి నూతన రైలు మార్గం నిర్మాణ ప్రక్రియ...
- February 16, 2017
ఏపీ రాజధాని అమరావతి నూతన రైలు మార్గం నిర్మాణ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. రైల్వే జీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన గురువారం గుంటూరు రైల్వే డివిజన్ పర్యవేక్షణకు వచ్చారు. పగిడిపల్లె వద్ద నుంచి ఆయన నాగిరెడ్డి పల్లె, చిట్యాల, నల్గొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, నడికుడి, పిడుగురాళ్ళ, సత్తెన పల్లి, నల్లపాడు రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించి వంతెనల పటిష్టతను పరిశీలించారు. రైల్వే క్వార్టర్స్, నూతన ఆర్పీ ఎఫ్ భవనాన్ని ప్రారంభించారు. తనిఖీలు, ప్రారంభోత్సవాల అనంతరం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు-తెనాలి రెండో వరుస రైలు మార్గం పనులను 2018-19లో పూర్తి చేస్తామన్నారు. నడికుడి- శ్రీకాళహస్తి నూతన మార్గం తొలి దశ 30 కిలోమీటర్ల నిర్మాణాన్ని ఏడిదిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్క రైలు సురక్షితంగా గమ్యస్థానానికి చేరేకునేలా చేయడమే తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు. అన్ని రైల్వే స్టేషన్లలో ఎక్స్ప్రెస్ రైళ్ళ నిలుపుదల సౌకర్యం సాధ్యం కాదని, అయితే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







