ఇకపై ఆధార్ ఉండాల్సిందే స్కాలర్షిప్ కావాలంటే
- February 18, 2017న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉపకార వేతనాలు అందుకోవాలంటే ఇకపై ఆధార్ గుర్తింపు తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేంద్ర మానవ వనరుల శాఖ వెల్లడించింది. ఇప్పటికే స్కాలర్షిప్పులు పొందుతున్నవారు జూన్ 30 నాటికల్లా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా దీని నుంచి జమ్మూ కాశ్మీర్ను మినహాయిస్తున్నట్టు హెచ్ఆర్డీ తెలిపింది. కేంద్ర రంగ ఉపకారవేతనాల పథకం కింద స్కాలర్షిప్లు అందుకోగోరిన కాలేజీ, యూనివర్శిటీ విద్యార్థులు సహా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పొందాలనుకుంటున్న పిల్లలు సైతం జూన్ 30లోగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని హెచ్చార్డీ వెల్లడించింది.నేరుగా విద్యార్ధుల ఖాతాల్లోకి స్కాలర్షిప్ జమ చేయడంతో పాటు ఆధార్ అనుసంధానం వల్ల ఈ ప్రక్రియలో మరింత పారదర్శకత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు