ఇకపై ఆధార్ ఉండాల్సిందే స్కాలర్షిప్ కావాలంటే
- February 18, 2017
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉపకార వేతనాలు అందుకోవాలంటే ఇకపై ఆధార్ గుర్తింపు తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేంద్ర మానవ వనరుల శాఖ వెల్లడించింది. ఇప్పటికే స్కాలర్షిప్పులు పొందుతున్నవారు జూన్ 30 నాటికల్లా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా దీని నుంచి జమ్మూ కాశ్మీర్ను మినహాయిస్తున్నట్టు హెచ్ఆర్డీ తెలిపింది. కేంద్ర రంగ ఉపకారవేతనాల పథకం కింద స్కాలర్షిప్లు అందుకోగోరిన కాలేజీ, యూనివర్శిటీ విద్యార్థులు సహా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పొందాలనుకుంటున్న పిల్లలు సైతం జూన్ 30లోగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని హెచ్చార్డీ వెల్లడించింది.నేరుగా విద్యార్ధుల ఖాతాల్లోకి స్కాలర్షిప్ జమ చేయడంతో పాటు ఆధార్ అనుసంధానం వల్ల ఈ ప్రక్రియలో మరింత పారదర్శకత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







