పసిడి ధర పరుగులు పెడుతూ పోతోంది
- February 18, 2017
ముంబై: పసిడి ధర పరుగులు పెడుతూ పోతోంది. బంగారం ధరలో మూడు వారాలుగా తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా ఈరోజు పది గ్రాములకు రూ.155 పెరిగి రూ.29,880కు చేరుకుంది. స్థానిక బంగారు వర్తకుల నుంచి డిమాండ్ పెరగడంతో ధర పెరిగినట్టు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. వెండి కూడా కిలోకు రూ.400 పెరిగి రూ.43,450 వద్ద ఆగింది. ఇండ్రస్ట్రియల్ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.29,950 కాగా 99.5 స్వచ్ఛత కలిగిన పసిడి ధర పది గ్రాములకు రూ.29,800 పలుకుతోంది.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







