జరిమానా చెల్లించండి లేదా కారు స్వాధీనం చేయండి -దుబాయ్ పోలీస్
- September 19, 2015
5,000 దిర్హమ్స్ కంటే ఎక్కువగా ట్రాఫిక్ జరిమానా బకాయి పడిన లేదా రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన వాహనాలపై దుబాయ్ పోలీసు వారి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు కఠిన చర్యలు తీసుకోనున్నారు. తాఖీదు పంపినప్పటికీ నిర్ణీత గడువు లోగా జరిమానా చెల్లించని వాహన యజమానుల కార్లు జప్తు చేయబడతాయని అక్టింగ్ డైరక్టర్ కల్నల్ జమాల్ అల్ బనై హెచ్చరించారు. వారికి తెలియదనే కారణంతో తప్పించుకోలేరని, వారికి సంబంధించిన సమాచారాన్ని, చిరునామాను అందుబాటులో ఉంచడం వారి బాధ్యతేనని, జరిమానా విధించడానికి వాహనాలను ఆపడం వలన ట్రాఫిక్ కు ఇబ్బoదవుతుందని, నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయనే సందర్భంలోనే ఆపుతామని, వాహనదారులు వారికి డిపార్ట్మెంటు వారు పంపిన SMS లను గమనించుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఇంకా 50 దిర్హమ్స్ను చెల్లించడం ద్వారా ఏ విధమైన బకాయిలు లేవనే ధృవ పత్రం శాఖ వారు ఇస్తారని కూడా తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







