జరిమానా చెల్లించండి లేదా కారు స్వాధీనం చేయండి -దుబాయ్ పోలీస్
- September 19, 2015
5,000 దిర్హమ్స్ కంటే ఎక్కువగా ట్రాఫిక్ జరిమానా బకాయి పడిన లేదా రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన వాహనాలపై దుబాయ్ పోలీసు వారి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు కఠిన చర్యలు తీసుకోనున్నారు. తాఖీదు పంపినప్పటికీ నిర్ణీత గడువు లోగా జరిమానా చెల్లించని వాహన యజమానుల కార్లు జప్తు చేయబడతాయని అక్టింగ్ డైరక్టర్ కల్నల్ జమాల్ అల్ బనై హెచ్చరించారు. వారికి తెలియదనే కారణంతో తప్పించుకోలేరని, వారికి సంబంధించిన సమాచారాన్ని, చిరునామాను అందుబాటులో ఉంచడం వారి బాధ్యతేనని, జరిమానా విధించడానికి వాహనాలను ఆపడం వలన ట్రాఫిక్ కు ఇబ్బoదవుతుందని, నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయనే సందర్భంలోనే ఆపుతామని, వాహనదారులు వారికి డిపార్ట్మెంటు వారు పంపిన SMS లను గమనించుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఇంకా 50 దిర్హమ్స్ను చెల్లించడం ద్వారా ఏ విధమైన బకాయిలు లేవనే ధృవ పత్రం శాఖ వారు ఇస్తారని కూడా తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







