రషీద్ బిన్ మొహమ్మద్ మృతికి సంతాపం ప్రకటించిన యూ. ఏ. ఈ., అధ్యక్షులు
- September 19, 2015
రాజకుమారుడు షేక్ రషీద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మృతికి యూ. ఏ. ఈ., అధ్యక్షులు - హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన సంతాపం వ్యక్తం చేశారు. కుమారుని మృతికి దుబాయ్ పరిపాలకులు, యూ. ఏ. ఈ., ఉపాధ్యక్షులు మరియు ప్రధాన మంత్రి హిజ్ హైనెస్ షేక్ మోహమ్మెడ్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కు తమ హృదయ పూర్వక సానుభూతిని తెలియజేశారు. గతించిన రాజకుమారుడు స్వర్గస్తుడవ్వాలని, అతని తల్లిదండ్రులకు ఆ అల్లా ఉపశమనాన్నివ్వాలని ప్రార్ధించారు.
అబుధాబీ యువరాజు మరియు యూ. ఏ. ఈ., సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ హిజ్ హైనెస్ షేక్ మొహమేద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ , షార్జా పరిపాలకుడు హిజ్ హైనెస్ షేక్ సుల్తాన్ బిన్ మోహమ్మెద్ అల్ కసీమి, ఫూజరీయా పరిపాలకుడు హిజ్ హైనెస్ షేక్ హమాద్ బిన్ మోహమ్మెద్ అల్ షార్కీ, రాస్ అల్ఖైమా పరిపాలకుడు, ఉమ్మ్ అల్ కువైన్ అధినేత షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ము'అల్లా, అజ్మాన్ పరిపాలకుడు - హిజ్ హైనెస్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నువైమీ తో సహా అరబ్ దేశాల ప్రముఖులు , వారి దర్బార్లు చిన్న వయసులోనే గతించిన రాజకుమారుని మృతికి తీవ్ర దిగ్భంతిని సంతాపాన్ని ప్రకటిస్తూ మూడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు







