లైసెన్స్ లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన వ్యక్తికి డబుల్ జరిమానా
- February 22, 2017
దోహా : ఒకరి నిర్లక్ష్యం మరొకరి పాలిట శాపం కారాదు అని దోహా నేర న్యాయస్థానం లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన ఓ ట్యునీషియా వ్యక్తికి రెండు రకాల భారీ జరిమానాలు విధించింది. నిందితుడు చెల్లుబాటులో లేని కతర్ డ్రైవింగ్ లైసెన్స్ తో వాహనం నడిపి మరొక వ్యక్తి గాయపడటానికి కారణమయ్యాడు. దీనితో దోహా క్రిమినల్ కోర్ట్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు 3,000 కతర్ రియాళ్ళు, మరొక వ్యక్తి తీవ్రంగా గాయాలపాలవ్వడానికి కాణమయ్యాడని అందుకు అదనంగా మరో 3,000 కతర్ రియాళ్ళు జరిమాన విధించారు. ప్రతివాది గాయ పరిహారాన్ని చెల్లించేందుకు వాహన బీమా సంస్థ సహకారంతో 4,000 కతర్ రియాళ్ళు చెల్లించడానికి అనుమతిస్తూ కోర్టు ఆదేశించింది .ప్రతివాది సల్వా రోడ్డు మీద ఒక చెల్లుబాటు కానీ డ్రైవింగ్ లైసెన్స్ తో వాహనం నడపడమే కాక నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన కారణంగా ఒక మోటూరిస్టు గాయపడ్డారు. మరొక వాహనం ని ఢీ కొట్టాడు. పరిశోధనల అనంతరం నిందితుడు తాను నడుపుతున్న వాహనాన్ని సరైన దారిలో నడపడంలో విఫలమయ్యాడని అలాగే నిందితునికి ఒక కాలపరిమితి దాటిపోయిన కతర్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కల్గి ఉన్నట్లు ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







