ఢిల్లీ విమానాశ్రయం లో 4 కిలోల బంగారం పట్టివేత

- September 20, 2015 , by Maagulf
ఢిల్లీ విమానాశ్రయం లో 4 కిలోల బంగారం పట్టివేత

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానంలోని టాయిలెట్లో 4 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు. దోహా నుంచి వచ్చిన ఖతార్ ఎయిర్వేస్ విమానం నుంచి అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే విమానాశ్రయంలో మరో రెండు సంఘటనల్లో అక్రమంగా తరలిస్తున్న 6 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరు ప్రయాణికులు, టర్కీ నుంచి వస్తున్న మరో ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ విమానాశ్రయంలో ఒకే రోజు దాదాపు 10కిలోల బంగారం పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ దాదాపు రూ. 2.5 కోట్లు ఉంటుందని వారు పేర్కొన్నారు. 

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com