ఢిల్లీ విమానాశ్రయం లో 4 కిలోల బంగారం పట్టివేత
- September 20, 2015
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానంలోని టాయిలెట్లో 4 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు. దోహా నుంచి వచ్చిన ఖతార్ ఎయిర్వేస్ విమానం నుంచి అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే విమానాశ్రయంలో మరో రెండు సంఘటనల్లో అక్రమంగా తరలిస్తున్న 6 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరు ప్రయాణికులు, టర్కీ నుంచి వస్తున్న మరో ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ విమానాశ్రయంలో ఒకే రోజు దాదాపు 10కిలోల బంగారం పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ దాదాపు రూ. 2.5 కోట్లు ఉంటుందని వారు పేర్కొన్నారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







