వాట్సప్లో యూజర్లు తమ నగదు లావాదేవీలను నిర్వహించుకునేలా మరో అదనపు ఫీచర్ కూడా చేరబోతోందా
- February 24, 2017
న్యూఢిల్లీ: మెసెజింగ్ యాప్ వాట్సప్లో యూజర్లు తమ నగదు లావాదేవీలను నిర్వహించుకునేలా మరో అదనపు ఫీచర్ కూడా చేరబోతోందా? అంటే అవుననే అంటున్నారు సంస్థ కో ఫౌండర్ బ్రియాన్ యాక్టన్. అయితే ఈ విషయంలో వాట్సప్ ఇప్పుడిప్పుడే కసరత్తులు ప్రారంభించిందని.. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి మరికొంతకాలం పడుతుందని తెలుస్తోంది. భారత పర్యటనకు వచ్చిన యాక్టన్.. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ ఇండియా కోసం ప్రభుత్వం కృషి బాగుందని ఆయన కితాబిచ్చారు.
మాజీ యాహూ ఉద్యోగులు జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ 2009లో ప్రారంభించిన వాట్సప్.. శుక్రవారం ఎనిమిదో సంవత్సరంలోకి ప్రవేశించింది.
ప్రపంచవ్యాప్తంగా వాట్సప్కు 1.2 బిలియన్ల మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. ఇందులో భారత్లోనే 200 మిలియన్ల యూజర్లు ఉన్నారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









