అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజలకి టాటా వారి సూచనలు
- February 25, 2017
విద్వేషపూరిత దాడుల నేపథ్యంలో ప్రవాస భారతీయుల్లో ఆందోళన తారస్థాయికి చేరింది. మనసారా మాతృభాషలో మాట్లాడుకోవాలన్నా భయపడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కలుసుకున్నపుడు ఆంగ్లంలోనే మాట్లాడుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పుకుంటున్నారు.
''అమెరికాలో బహిరంగ ప్రదేశాల్లో కలుసుకున్నపుడు హిందీలోగానీ, ఏదైనా ఇతర భారతీయ భాషలో మాట్లాడుకోవద్దు. దానివల్ల మీకు తీవ్ర ఇబ్బందులు రావచ్చు'' అని ప్రవాస భారతీయులు సామాజిక మాధ్యమాల్లో ఒకరికొకరు సందేశాలు పెట్టుకుంటున్నారు. శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాడసానిలపై దాడి అనంతరం అమెరికాలో ఉంటున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు, ఆందోళనతో విలవిలలాడుతున్నారు.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విక్రమ్ జంగమ్ కొన్ని ముందు జాగ్రత్తలను సూచించారు. మిగతా విషయాల కన్నా ప్రాణం చాలా విలువైనదని చెప్పారు. క్రింద పేర్కొన్న జాగ్రత్తలను దక్షిణాసియా దేశాలవారు, తెలుగువారు పాటించాలని తెలిపారు.
- బహిరంగ ప్రదేశాల్లో ఇతరులతో వాదనకు దిగవద్దు.
- ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే, ఎదురు మాట్లాడకుండా అక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోండి.
- మన మాతృ భాషలో మాట్లాడటాన్ని మనం ఎంతగా ఇష్టపడితే అంతగా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో ఇంగ్లిష్లో మాట్లాడుకోగలరేమో చూసుకోండి.
- ఏకాంత ప్రదేశాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఒంటరిగా వెళ్ళడం కానీ, ఒంటరిగా ఉండటం కానీ చేయకండి.
- అత్యవసర పరిస్థితుల్లో 911కు ఫోన్ చేయడానికి సందేహించవద్దు. అటువంటి పరిస్థితుల్లో అధికారులు వచ్చి సహాయపడతారు.
- మీ పరిసరాలను గమనిస్తూ ఉండండి, ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే చెప్పండి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







