ఆధార్తో సంబంధం లేకుండానే పెన్షన్ ఖాతా నుంచి పూర్తి సొమ్ము విత్డ్రా
- February 28, 2017
తాజా ఆదేశాల్లో స్పష్టం చేసిన ఈపీఎఫ్వో
న్యూఢిల్లీ: ఆధార్తో సంబంధం లేకుండానే పెన్షన్ ఖాతా నుంచి పూర్తి సొమ్ము విత్డ్రా చేసుకునేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) చందాదారులకు అవకాశం కల్పించింది. తాజా ఆదేశాల ప్రకారం పదేళ్ల కంటే తక్కువ సర్వీస్ ఉండి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న చందాదారు ఫారం 10సీతో పాటు ఆధార్ను జతచేయడం తప్పనిసరి కాదని ఈపీఎఫ్వో సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఫారం 10డి ద్వారా పెన్షన్ నిర్ధారించుకునే చందాదారు మాత్రం ఆధార్ నంబర్గానీ ఎన్ రోల్మెంట్ స్లిప్గానీ సమర్పించాల్సి ఉంటుంది.
చందాదారులకు ఈ వెసులు బాటు కల్పించడం వెనుక కారణాన్ని వివరిస్తూ ఫారం 10సీలో ఆధార్ నెంబర్ తప్పనిసరి చేయడం వల్ల సెటిల్మెంట్ సమయంలో కొన్ని సమస్యలు తలెత్తాయని అందువల్ల దీన్ని కేవలం ఫారం 10డి ద్వారా పెన్షన్ ఫిక్సింగ్కి మాత్రమే పరిమితం చేసినట్లు వెల్లడించారు. చందాదారులతో పాటు పెన్షనర్లకు కూడా ఆధార్ తప్పనిసరి చేస్తూ జనవరిలో ఈపీఎఫ్వో ఆదేశాలు జారీచేసింది.
అంతే కాకుండా ఈ సంస్థ తరపున అమలవుతున్న అన్ని సామాజిక భద్రతా పథకాల అమలుకు కూడా ఆధార్ తప్పనిసరి చేసింది. ఉద్యోగుల పెన్షన్ స్కీం 1995 ప్రకారం ఉద్యోగుల పెన్షన్ సెటిల్మెంట్కు చేసుకునే దరఖాస్తులో ఆధార్ను తప్పనిసరి చేస్తూ జనవరి చివర్లో ఆదేశాలు జారీ చేసింది. కాగా చందాదారులతో పాటు పెన్షనర్లకు ఆధార్ సమర్పించేందుకు ఇచ్చిన గడువును మార్చి 31 వరకు పొడిగిస్తూ ఈపీఎఫ్వో ఫిబ్రవరి మొదట్లో నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







