మార్చి 28నే ఉగాది: శ్రీనివాస గార్గేయ
- February 28, 2017
విజయవాడ, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): తిరుమల, శ్రీశైలం దేవస్థానాల పంచాంగాలతో జనంలో గందరగోళం నెలకొందని, ఉగాది పండుగను మార్చి 28వ తేదీనే జరుపుకోవాలని పొన్నలూరు శ్రీనివాస గార్గేయ సిద్ధాంతి విజ్ఞప్తి చేశారు. విజయవాడలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ''2016 ఆగస్టు 12వ తేదీన విజయవాడలో జయేంద్ర సరస్వతి సమక్షంలో జరిగిన ఒక సమావేశంలో హేవిళంబి నామ సంవత్సర ఉగాదిని 2017 మార్చి 28న నిర్వహించాలని నిర్ణయించారు. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధాంతి కూడా ఇందుకు అంగీకరించారు. కానీ, బయటికి వచ్చాక మార్చి 29వ తేదీన ఉగాది అని ప్రకటించి, పంచాంగాలలో ఆ మేరకే ముద్రించారు. పాడ్యమి తిథి సూర్యోదయం తరువాత కనీసం 144 నిముషాలు ఉండాలి.
కానీ, 29వ తేదీ కేవలం 58 నిముషాలే ఉంటుంది. అందుకే, 28వ తేదీనే ఉగాది జరుపుకోవాలి'' అని శ్రీనివాస గార్గేయ తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







