మార్చి 28నే ఉగాది: శ్రీనివాస గార్గేయ

- February 28, 2017 , by Maagulf
మార్చి 28నే ఉగాది: శ్రీనివాస గార్గేయ

విజయవాడ, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): తిరుమల, శ్రీశైలం దేవస్థానాల పంచాంగాలతో జనంలో గందరగోళం నెలకొందని, ఉగాది పండుగను మార్చి 28వ తేదీనే జరుపుకోవాలని పొన్నలూరు శ్రీనివాస గార్గేయ సిద్ధాంతి విజ్ఞప్తి చేశారు. విజయవాడలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ''2016 ఆగస్టు 12వ తేదీన విజయవాడలో జయేంద్ర సరస్వతి సమక్షంలో జరిగిన ఒక సమావేశంలో హేవిళంబి నామ సంవత్సర ఉగాదిని 2017 మార్చి 28న నిర్వహించాలని నిర్ణయించారు. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధాంతి కూడా ఇందుకు అంగీకరించారు. కానీ, బయటికి వచ్చాక మార్చి 29వ తేదీన ఉగాది అని ప్రకటించి, పంచాంగాలలో ఆ మేరకే ముద్రించారు. పాడ్యమి తిథి సూర్యోదయం తరువాత కనీసం 144 నిముషాలు ఉండాలి.
కానీ, 29వ తేదీ కేవలం 58 నిముషాలే ఉంటుంది. అందుకే, 28వ తేదీనే ఉగాది జరుపుకోవాలి'' అని శ్రీనివాస గార్గేయ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com