తీగలను దొంగిలించిన ఇద్దరు పాకిస్థానీయులకు జైలు శిక్ష
- March 01, 2017
దుబాయ్ : గార్డుని గాయపరిచి ఒక నిర్మాణ స్థలం నుండి తీగలను దొంగిలించారని అభియోగంపై ఇరువురు పాకిస్థానీయులకు ఒకొక్కరకి ఆరునెలల జైలుశిక్ష విధించారు. ఉద్యోగం సద్యోగం లేని ఆ ఇరువురు వయస్సు 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఉంటుంది. గతంలోనే ఈ వ్యక్తులకు నేరచరిత్ర ఉంది. ఈ సహచరులు జనవరి 28, 2015, వారు అల్ ఖవానీజ్ ,అల్ రాషిదీయహ్ నిర్మాణ స్థలం నుండి 14,000 ధిర్హాంల విలువ చేసే తీగలను తంతులు దొంగిలించారనే నేరం వీరిపై ఆరోపించబడింది. వీరు ఇరువురు దొంగతనంకు వెళ్లిన సమయంలో సెక్యూరిటీ గార్డు మేల్కొన్నాడు. అయితే వీరు ఒక కర్రతో ఆ భద్రతకు నియమించబడిన వ్యక్తిని బెదిరించి ఒక పదునైన పరికరంతో అక్కడ ఉన్నతీగలను అపహరించారు. ఈ దొంగతనం విషయమై కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఎదుట తమ నేరాన్ని అంగీకరించారు. అయితే, వారు దోషులుగా కోర్టు జైలు శిక్షని పూర్తి చేసిన తర్వాత వారిని దేశ బహిష్కరణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







