క్వీన్ ఎలిజబెత్ ను కలిసిన కమల్
- March 02, 2017
సిని పరిశ్రమలో ఓ ఆపుర్వ సంఘటన చోటు చేసుకుంది లోకనాయకుడు కమల్హాసన్ బ్రిటన్ రాణి ఎలిజబెత్-2ను కలిశారు. బకింగ్హామ్ ప్యాలెస్లో జరిగిన ఇండో-యూకే కల్చరల్ ఎక్స్ఛేంజి సెలబ్రేషన్స్ 2017 కార్యక్రమంలో కమల్హాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భం క్వీన్ ఎలిజబెత్ ఆయన కలిశారు. అలాగే ఆమె భారత్ పర్యటనను గుర్తుంచుకున్నారు కమల్హాసన్. 1997లో క్వీన్ ఎలిజబెత్ భారత పర్యటనలో భాగంగా చెన్నైకి వెళ్లారు. అప్పుడు ఆమె మరుదనాయగం సినిమా సెట్కు రావడాన్ని కమల్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం కమల్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శభాష్ నాయుడు' తో బిజీగా వున్నారు. ఈ చిత్రంలో కమల్ కు జోడిగా రమ్యకృష్ణ నటిస్తుండగా, ఆయన కూతురి పాత్రను శ్రుతి హసన్ పోషిస్తోంది. బ్రహ్మానందం ఇందులో మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!









