మహేష్, కొరటాలశివ కు ఊరట నిచ్చిన హైకోర్టు

- March 02, 2017 , by Maagulf
మహేష్, కొరటాలశివ కు ఊరట నిచ్చిన హైకోర్టు

ప్రిన్స్ మహేష్ సూపర్ హిట్ సినిమా శ్రీమంతుడు సినిమా స్టోరీ ... 2012 లో స్వాతి మాస పత్రికలో ప్రచురించ బడ్డ "చచ్చేంత ప్రేమ" నవలకు కాపీ అని రచయిత శరత్ చంద్ర మీడియా ముందుకు రావడం కాదు కోర్టు మెట్లు కూడా ఎక్కాడు.. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని దాసరి, పరుచూరి వంటి వారు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాక మరింత ముదిరింది. దీంతో మహేష్, కొరటాల శివలు న్యాయస్థానం లో హాజరు కావాలని నాంపల్లి కోర్టు  సమన్లు జారీ అయిన సంగతి విధితమే.. కాగా ఈ సమన్లపై మహేష్, కొరటాల శివ లు వేరు వేరుగా హైకోర్టు ను ఆశ్రయించారు. దీంతో హైకోర్టు నాంపల్లి కోర్టు ఇచ్చిన సమన్లు ను నిలిపివేస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నెక్స్ట్ చర్యలు ఎలా ఉంటాయి... కొరటాల శివ ఇప్పటికైనా రచయితతో రాజీ పడతాడా...అని ఫిల్మ్ నగర్ టాక్.. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ కథ కాపీ వ్యవహారంలో శ్రీమంతుడికి కాస్త ఊరట లభించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com