నటనకు గుడ్ బై చెప్పి డైరెక్షన్ మీద రవితేజ
- March 04, 2017
ఏడాదిపాటు వెండితెరకు దూరమై ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకుంటోన్న మాస్ మహారాజ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ అనే రెండు సినిమాలు చేస్తున్న రవితేజ ఇక ఎంతోకాలం వెండితెరమీద నటించడన్నది ఇన్నర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట. ఇటీవల ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో చేసిన సినిమాలేవీ సరైన విజయాన్ని అందించకపోవడంతో రవితేజ కొత్త ఆలోచనలు చేస్తున్నాడని, నటనకు గుడ్ బై చెప్పి డైరెక్షన్ మీద దృష్టిపెడుతున్నాడని సమాచారం.
రవితేజ నటుడిగా గుర్తింపు తెచ్చుకోకముందే డైరెక్షన్ డిపార్టుమెంట్ లో పని చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత డైరెక్టర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనానేంటో చూపించాలని రవితేజ కసిగానే ఉన్నాడంటున్నారు.
ఇదిలాఉంటే, తాజాగా రవితేజ తన ట్విట్టర్ ఖాతా ద్వారా డైరెక్షన్ చేస్తానని.. అయితే, అది ఎప్పుడో చెప్పలేనంటూ చేసిన వ్యాఖ్యలు వీటికి బలం చేకూరుస్తున్నాయి. నటనలో తనకంటూ ఓ ప్రత్యేకతను చూపించి అందరి అభిమానాన్ని చూరగొన్న రవితేజ, ఇక డైరెక్షన్ ద్వారా ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









