నటనకు గుడ్ బై చెప్పి డైరెక్షన్ మీద రవితేజ
- March 04, 2017
ఏడాదిపాటు వెండితెరకు దూరమై ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకుంటోన్న మాస్ మహారాజ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ అనే రెండు సినిమాలు చేస్తున్న రవితేజ ఇక ఎంతోకాలం వెండితెరమీద నటించడన్నది ఇన్నర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట. ఇటీవల ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో చేసిన సినిమాలేవీ సరైన విజయాన్ని అందించకపోవడంతో రవితేజ కొత్త ఆలోచనలు చేస్తున్నాడని, నటనకు గుడ్ బై చెప్పి డైరెక్షన్ మీద దృష్టిపెడుతున్నాడని సమాచారం.
రవితేజ నటుడిగా గుర్తింపు తెచ్చుకోకముందే డైరెక్షన్ డిపార్టుమెంట్ లో పని చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత డైరెక్టర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనానేంటో చూపించాలని రవితేజ కసిగానే ఉన్నాడంటున్నారు.
ఇదిలాఉంటే, తాజాగా రవితేజ తన ట్విట్టర్ ఖాతా ద్వారా డైరెక్షన్ చేస్తానని.. అయితే, అది ఎప్పుడో చెప్పలేనంటూ చేసిన వ్యాఖ్యలు వీటికి బలం చేకూరుస్తున్నాయి. నటనలో తనకంటూ ఓ ప్రత్యేకతను చూపించి అందరి అభిమానాన్ని చూరగొన్న రవితేజ, ఇక డైరెక్షన్ ద్వారా ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







