నటనకు గుడ్ బై చెప్పి డైరెక్షన్ మీద రవితేజ
- March 04, 2017ఏడాదిపాటు వెండితెరకు దూరమై ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకుంటోన్న మాస్ మహారాజ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ అనే రెండు సినిమాలు చేస్తున్న రవితేజ ఇక ఎంతోకాలం వెండితెరమీద నటించడన్నది ఇన్నర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట. ఇటీవల ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో చేసిన సినిమాలేవీ సరైన విజయాన్ని అందించకపోవడంతో రవితేజ కొత్త ఆలోచనలు చేస్తున్నాడని, నటనకు గుడ్ బై చెప్పి డైరెక్షన్ మీద దృష్టిపెడుతున్నాడని సమాచారం.
రవితేజ నటుడిగా గుర్తింపు తెచ్చుకోకముందే డైరెక్షన్ డిపార్టుమెంట్ లో పని చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత డైరెక్టర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనానేంటో చూపించాలని రవితేజ కసిగానే ఉన్నాడంటున్నారు.
ఇదిలాఉంటే, తాజాగా రవితేజ తన ట్విట్టర్ ఖాతా ద్వారా డైరెక్షన్ చేస్తానని.. అయితే, అది ఎప్పుడో చెప్పలేనంటూ చేసిన వ్యాఖ్యలు వీటికి బలం చేకూరుస్తున్నాయి. నటనలో తనకంటూ ఓ ప్రత్యేకతను చూపించి అందరి అభిమానాన్ని చూరగొన్న రవితేజ, ఇక డైరెక్షన్ ద్వారా ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్