ప్రశాంతంగా ఎన్నికలు - యూపీ, మణిపూర్ లో
- March 04, 2017
ఉత్తర్ ప్రదేశ్ లో ఆరోవిడత, మణిపూర్ లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. యూపీలోని 49 నియోజకవర్గాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోని 38 నియోజకవర్గాలకు మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజంగఢ్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఇవాళే పోలింగ్ జరుగుతోంది. దీంతో ఈ ఎన్నికలు ములాయంకు ప్రతిష్టాత్మకంగా మారాయి. యూపీలో ఈసారి ఓటింగ్ శాతం పెరగవచ్చని భావిస్తున్నారు. అటు మణిపూర్ లో ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 69 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









