ప్రశాంతంగా ఎన్నికలు - యూపీ, మణిపూర్ లో
- March 04, 2017
ఉత్తర్ ప్రదేశ్ లో ఆరోవిడత, మణిపూర్ లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. యూపీలోని 49 నియోజకవర్గాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోని 38 నియోజకవర్గాలకు మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజంగఢ్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఇవాళే పోలింగ్ జరుగుతోంది. దీంతో ఈ ఎన్నికలు ములాయంకు ప్రతిష్టాత్మకంగా మారాయి. యూపీలో ఈసారి ఓటింగ్ శాతం పెరగవచ్చని భావిస్తున్నారు. అటు మణిపూర్ లో ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 69 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







