ప్రశాంతంగా ఎన్నికలు - యూపీ, మణిపూర్ లో

- March 04, 2017 , by Maagulf
ప్రశాంతంగా ఎన్నికలు -  యూపీ, మణిపూర్ లో

ఉత్తర్ ప్రదేశ్ లో ఆరోవిడత, మణిపూర్ లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. యూపీలోని 49 నియోజకవర్గాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోని 38 నియోజకవర్గాలకు మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజంగఢ్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఇవాళే పోలింగ్ జరుగుతోంది. దీంతో ఈ ఎన్నికలు ములాయంకు ప్రతిష్టాత్మకంగా మారాయి. యూపీలో ఈసారి ఓటింగ్ శాతం పెరగవచ్చని భావిస్తున్నారు. అటు మణిపూర్ లో ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 69 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com