ప్రశాంతంగా ఎన్నికలు - యూపీ, మణిపూర్ లో
- March 04, 2017ఉత్తర్ ప్రదేశ్ లో ఆరోవిడత, మణిపూర్ లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. యూపీలోని 49 నియోజకవర్గాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోని 38 నియోజకవర్గాలకు మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజంగఢ్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఇవాళే పోలింగ్ జరుగుతోంది. దీంతో ఈ ఎన్నికలు ములాయంకు ప్రతిష్టాత్మకంగా మారాయి. యూపీలో ఈసారి ఓటింగ్ శాతం పెరగవచ్చని భావిస్తున్నారు. అటు మణిపూర్ లో ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 69 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ