వీసా నిబంధనలు సడలించండి కెనడాకు భారత్ విజ్ఞప్తి
- March 04, 2017
వీసా నిబంధనలను సరళతరం చేయాలంటూ భారత ప్రభుత్వం కెనడాకు విజ్ఞప్తి చేసింది. ఇటీవల కెనడా ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినం చేసింది. దీంతో భారతీయ కంపెనీలు కెనడాలోని తమ యూనిట్లకు ఉద్యోగులను పంపడం కష్టంగా మారింది. ఈ పరిణామం వాణిజ్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పలువురు వ్యాపారవేత్తలు ఈ విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వారి వినతుల మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. కెనడా అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల మంత్రి ప్రాంకోయి్సతో నిర్మలా సీతారామన్ శుక్రవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.
కెనడాలోని తమ యూనిట్లలో పనిచేసేందుకు పలువురు ఉద్యోగులను భారతీయ కంపెనీలు షార్ట్ టర్మ్ వీసాపై పంపుతుంటాయిని, కెనడా ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన నిబంధనలతో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిర్మలా సీతారామన్ వివరించారు. దీనికి స్పందించిన కెనడా మంత్రి.. వీసా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్లోబల్ స్కిల్ సా్ట్రటజీ ప్రోగ్రాం కింద సాంకేతిక నిపుణులు, పరిశోధకుల వీసా దరఖాస్తులను రెండు వారాల్లో పరిష్కరిస్తున్నామని, అలాగే ఏడాదిలోపు మాత్రమే కెనడాలో ఉండే ఉద్యోగుల వీసా దరఖాస్తులనూ వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తామన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







