ఎన్‌కౌంటర్‌లో పాక్‌ ఉగ్రవాది హతమయ్యాడు

- March 04, 2017 , by Maagulf
ఎన్‌కౌంటర్‌లో పాక్‌ ఉగ్రవాది హతమయ్యాడు

కశ్మీర్‌లోని త్రాల్‌లో భద్రతా బలగాలకు, హిజ్‌బుల్‌ ముజాహి ద్దీన్‌ ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమ య్యాడు. శనివారం సాయంత్రం త్రాల్‌ నగరంలోని శివారులో ఆర్మీ ప్రత్యే క బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఓ ఇంట్లో ఐదుగురు ఉగ్రవాదులు దాగి ఉండడాన్ని గుర్తించాయి. ఈ సందర్భంగా హోరాహోరీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ ఓ పాకిస్థాన్‌ ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో గుమిగూడిన ఆందోళనకారులను భద్రత బలగాలు చెదరగొట్టాయి. అనంతరం ఆ ప్రాంతంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com