జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

- March 05, 2017 , by Maagulf
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామా జిల్లాలోని త్రాల్‌ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్‌ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. మృతి చెందిన పోలీస్‌ కానిస్టేబుల్ ను మంజూర్‌ అహ్మద్‌గా గుర్తించారు.

ఆ ప్రాంతంలో ఉన్న నక్కిన ఉగ్రవాదుల కోసం బలగాలు ఆపరేషన్‌ చేపట్టాయి. భద్రతా బలగాల కాల్పుల్లో అకిబ్ మోల్వితో పాటు మరో హిజ్బుల్‌ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులు నక్కిన భవనాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేసి ఆపరేషన్ నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com