రెండో పెద్ద ఎయిర్ పోర్ట్ టెర్మినల్ ప్రారంభించిన చైనా
- March 06, 2017
భారత సరిహద్దులో రెండో అతి పెద్ద ఎయిర్ పోర్టు టెర్మినల్ను చైనా సోమవారం ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్కు సమీపంలోని టిబెట్లో దీన్ని నిర్మించింది. ఆ ఎయిర్పోర్టులో ఇది ఆరో టెర్మినల్. సముద్ర మట్టానికి 2950 మీటర్ల ఎత్తులో 10,300 చదరపు మీటర్ల పరిధిలో ఉన్న ఈ ఎయిర్ పోర్టు 2006లో ప్రారంభమైంది.
2016 నాటికి ఈ ఎయిర్ పోర్టు సుమారు నాలుగు లక్షల ప్రయాణికులకు సేవలందించింది. 2020 నాటికి ఏడున్నర లక్షల ప్రయాణికులతో పాటు మూడు వేల టన్నుల సామాగ్రిని రవాణా చేసేలా చైనా దీన్ని అభివృద్ధి చేస్తోంది. ఆ దేశంలోని ప్రధాన నగరాల నుంచి టిబెట్కు విమాన సర్వీసులు నడుపుతోంది. అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలను మోహరించేలా దీన్ని తీర్చిదిద్దింది.
తాజా వార్తలు
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?







