రెండో పెద్ద ఎయిర్ పోర్ట్ టెర్మినల్ ప్రారంభించిన చైనా
- March 06, 2017భారత సరిహద్దులో రెండో అతి పెద్ద ఎయిర్ పోర్టు టెర్మినల్ను చైనా సోమవారం ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్కు సమీపంలోని టిబెట్లో దీన్ని నిర్మించింది. ఆ ఎయిర్పోర్టులో ఇది ఆరో టెర్మినల్. సముద్ర మట్టానికి 2950 మీటర్ల ఎత్తులో 10,300 చదరపు మీటర్ల పరిధిలో ఉన్న ఈ ఎయిర్ పోర్టు 2006లో ప్రారంభమైంది.
2016 నాటికి ఈ ఎయిర్ పోర్టు సుమారు నాలుగు లక్షల ప్రయాణికులకు సేవలందించింది. 2020 నాటికి ఏడున్నర లక్షల ప్రయాణికులతో పాటు మూడు వేల టన్నుల సామాగ్రిని రవాణా చేసేలా చైనా దీన్ని అభివృద్ధి చేస్తోంది. ఆ దేశంలోని ప్రధాన నగరాల నుంచి టిబెట్కు విమాన సర్వీసులు నడుపుతోంది. అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలను మోహరించేలా దీన్ని తీర్చిదిద్దింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం