సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్పై అప్రమత్తం
- March 06, 2017మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ (ఎంఓటిసి) సైబర్ సెక్యూరిటీ క్యు-సెర్ట్ అండర్ సెక్రెటరీ జనరల్ ఖాలిద్ అల్ హాషిమి మాట్లాడుతూ, సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్పై స్టేట్ ఆఫ్ ఖతార్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. ఐదు రోజులపాటు సాగే రీజినల్ సైబర్ డ్రిల్ (అలర్ట్) - ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒమన్, ఈజిప్ట్, ట్యునీషియా తదితర దేశాలతో కలిసి సైబర్ సెక్యూరిటీపై ఖతార్ పనిచేస్తోందని ఆయన అన్నారు. జాతీయ సరిహద్దులతో సమానంగా సైబర్ సెక్యూరిటీ అనేది ప్రభుత్వాలకి, వ్యక్తులకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు హాషిమి. ఐటియు ఎఆర్సిసి డహెడ్ బదర్ అల్ సలేహి మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ దాడులు, మరింత భద్రత గల సైబర్ వ్యవస్థ ఆవశ్యకతను తెలియజేస్తున్నాయని చెప్పారు. కంపూటర్లతో అనుసంధానమై ఉన్నవారి సంఖ్య 2015 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 12 ట్రిలియన్లకు చేరుకుందని ఐటియు అరబ్ రీజియన్ డైరెక్టర్ ఇబ్రహీమ్ అల్ హద్దాద్ చెప్పారు.
తాజా వార్తలు
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!







