సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్పై అప్రమత్తం
- March 06, 2017మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ (ఎంఓటిసి) సైబర్ సెక్యూరిటీ క్యు-సెర్ట్ అండర్ సెక్రెటరీ జనరల్ ఖాలిద్ అల్ హాషిమి మాట్లాడుతూ, సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్పై స్టేట్ ఆఫ్ ఖతార్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. ఐదు రోజులపాటు సాగే రీజినల్ సైబర్ డ్రిల్ (అలర్ట్) - ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒమన్, ఈజిప్ట్, ట్యునీషియా తదితర దేశాలతో కలిసి సైబర్ సెక్యూరిటీపై ఖతార్ పనిచేస్తోందని ఆయన అన్నారు. జాతీయ సరిహద్దులతో సమానంగా సైబర్ సెక్యూరిటీ అనేది ప్రభుత్వాలకి, వ్యక్తులకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు హాషిమి. ఐటియు ఎఆర్సిసి డహెడ్ బదర్ అల్ సలేహి మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ దాడులు, మరింత భద్రత గల సైబర్ వ్యవస్థ ఆవశ్యకతను తెలియజేస్తున్నాయని చెప్పారు. కంపూటర్లతో అనుసంధానమై ఉన్నవారి సంఖ్య 2015 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 12 ట్రిలియన్లకు చేరుకుందని ఐటియు అరబ్ రీజియన్ డైరెక్టర్ ఇబ్రహీమ్ అల్ హద్దాద్ చెప్పారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









