సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్పై అప్రమత్తం
- March 06, 2017
మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ (ఎంఓటిసి) సైబర్ సెక్యూరిటీ క్యు-సెర్ట్ అండర్ సెక్రెటరీ జనరల్ ఖాలిద్ అల్ హాషిమి మాట్లాడుతూ, సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్పై స్టేట్ ఆఫ్ ఖతార్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. ఐదు రోజులపాటు సాగే రీజినల్ సైబర్ డ్రిల్ (అలర్ట్) - ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒమన్, ఈజిప్ట్, ట్యునీషియా తదితర దేశాలతో కలిసి సైబర్ సెక్యూరిటీపై ఖతార్ పనిచేస్తోందని ఆయన అన్నారు. జాతీయ సరిహద్దులతో సమానంగా సైబర్ సెక్యూరిటీ అనేది ప్రభుత్వాలకి, వ్యక్తులకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు హాషిమి. ఐటియు ఎఆర్సిసి డహెడ్ బదర్ అల్ సలేహి మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ దాడులు, మరింత భద్రత గల సైబర్ వ్యవస్థ ఆవశ్యకతను తెలియజేస్తున్నాయని చెప్పారు. కంపూటర్లతో అనుసంధానమై ఉన్నవారి సంఖ్య 2015 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 12 ట్రిలియన్లకు చేరుకుందని ఐటియు అరబ్ రీజియన్ డైరెక్టర్ ఇబ్రహీమ్ అల్ హద్దాద్ చెప్పారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్జెట్..!!
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!
- ఫోర్బ్స్ సంపన్నుల జాబితా..దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ..
- భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!