భారతీయులకు భరోసా ఇచ్చిన అమెరికా గవర్నర్ శ్యామ్‌ బ్రౌన్‌ బ్యాక్‌

- March 06, 2017 , by Maagulf
భారతీయులకు భరోసా ఇచ్చిన అమెరికా గవర్నర్ శ్యామ్‌ బ్రౌన్‌ బ్యాక్‌

భారతీయులు తమకు ఎంతో ముఖ్యమైన వారని అమెరికాలోని కాన్సాస్‌ గవర్నర్‌ శ్యామ్‌ బ్రౌన్‌ బ్యాక్‌ అన్నారు. ఇటీవల కాన్సాస్‌ బార్ తెలుగు ఎన్నారై శ్రీనివాస్ కూచిబొట్లపై కాల్పుల ఘటనపై.. కాన్సాస్‌ గవర్నర్‌ భారత దౌత్యాధికారులు, స్థానిక ఎన్నారై కమ్యూనిటీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భారతీయులకు ఆయన భరోసా ఇచ్చారు. వివిధ దేశాల నుంచి ఎంతోమంది ఉపాధి కోసం కాన్సాస్ వస్తుంటారని... కానీ భారతీయులు మాత్రం తమకు చాలా ముఖ్యమైన వారని గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్ అన్నారు. జాతి విచక్షణ పేరుతో హింస జరగడాన్ని తాము అంగీకరించేది లేదన్నారు. మొన్నటి ఘటనకు తాను సిగ్గుపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారతీయులకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్న సిద్ధమంగా ఉన్నామని గవర్నర్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com