అబుధాబిలో భారతీయుడికి బంపర్ లాటరీ
- March 06, 2017
భారతదేశం నుంచి అబుదాబీకి వలస వెళ్లిన ఓ వ్యక్తికి రూ.12కోట్లు లాటరీ తగిలింది. కేరళకు చెందిన 33ఏళ్ల శ్రీరాజ్ కృష్ణన్ కొప్పరింబిల్ దాదాపు ఏడు మిలియన్ దిర్హామ్లు(రూ.12,71,70,000) విలువైన లాటరీని గెలుచుకున్నాడు. సండే రిలీజ్ చేసిన అబుధాబి బిగ్ టిక్కెట్ డ్రాలో ఆయన విజయం సాధించారు. ‘బిగ్ టిక్కెట్ విజేత తానే అని ఫోన్ రాగానే నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు 44698ను నా అదృష్ట నంబకర్ గా మారిపోయింది. ఈ టిక్కెట్ కొన్నప్పుడు ఇదే నా చివరి లాటరీ అనుకున్నాను. ఈ డబ్బుతో భారత్లో ఉన్న గృహ రుణాన్ని తీర్చేస్తాను. నా భార్య కూడా అదే అనుకుంటోంది. నాకు అదృష్టాన్ని తెచ్చిన దేశంలో నేను ఎందుకు ఉండకూడదు.. నేను పరిపక్వత ఉన్న మనిషిని భూమిపై నిలబడి ఆలోచిస్తాను.’’ అని కృష్ణన్ తెలిపారు.
యూఏఈ కి వలస వెళ్లిన కృష్ణన్ ఒక షిప్పింగ్ కంపెనీలో 9 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతను లాటరీలను తరచూ కొనుగోలు చేస్తుంటారు. కానీ అంతకుముందు ఎన్నడూ గెలుచుకోలేదు. ఇప్పుడే పెద్ద ప్రణాళికలు ఏమీలేవని కృష్ణన్ తెలిపారు. ముందు ఉద్వేగం తగ్గాక నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO