120 కిలోల బరువు తగ్గిన ప్రపంచ భారీకాయురాలు
- March 06, 2017
ప్రపంచంలోనే అత్యంత భారీకాయురాలైన ఈజిప్టు మహిళ ఈమన్ అహ్మద్ నెలరోజుల కాలంలో 120 కిలోల బరువు తగ్గారని ఆమెకు చికిత్స చేస్తున్న సైఫీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. జన్యు పరీక్షల నివేదిక రాగానే ఈమెకు బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈజిప్టు దేశంలోని అలెగ్జాండ్రియా నగరానికి చెందిన భారీకాయురాలైన ఈమన్ అహ్మద్ ను 25 ఏళ్ల తర్వాత మొదటిసారి ప్రత్యేక విమానంలో ముంబయికు తరలించి చికిత్స చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే.
భారీకాయం వల్ల ఈమన్ అహ్మద్ కు ఎమ్మారై పరీక్ష చేసేందుకు వీలుకాకపోవడం వల్ల పోర్టబుల్ ఎక్స్ రేలు తీస్తూ వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రోగి బరువును పరిశీలించేందుకు వీలుగా ఆమె పడుకున్న మంచానికే తూకపు యంత్రాన్ని బిగించారు.నిరంతరం ఫిజియోథెరపీ చేయడం వల్ల ఆమె సులవుగా ఆహారం తీసుకోవడంతోపాటు మాట స్పష్టంగా వస్తుందని డాక్టర్ ముఫజల్ లక్డావాలా చెప్పారు. మందుల వల్ల శరీరంలో ఉన్న ద్రవపదార్థాల శాతం తగ్గి మరో వందకిలోల బరువు తగ్గుతుందని డాక్టర్ లక్డావాలా వివరించారు. ఈమె చికిత్సకు దాతలు రూ.60 లక్షల రూపాయల దాకా విరాళం అందిందని వైద్యులు వివరించారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









