120 కిలోల బరువు తగ్గిన ప్రపంచ భారీకాయురాలు
- March 06, 2017
ప్రపంచంలోనే అత్యంత భారీకాయురాలైన ఈజిప్టు మహిళ ఈమన్ అహ్మద్ నెలరోజుల కాలంలో 120 కిలోల బరువు తగ్గారని ఆమెకు చికిత్స చేస్తున్న సైఫీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. జన్యు పరీక్షల నివేదిక రాగానే ఈమెకు బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈజిప్టు దేశంలోని అలెగ్జాండ్రియా నగరానికి చెందిన భారీకాయురాలైన ఈమన్ అహ్మద్ ను 25 ఏళ్ల తర్వాత మొదటిసారి ప్రత్యేక విమానంలో ముంబయికు తరలించి చికిత్స చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే.
భారీకాయం వల్ల ఈమన్ అహ్మద్ కు ఎమ్మారై పరీక్ష చేసేందుకు వీలుకాకపోవడం వల్ల పోర్టబుల్ ఎక్స్ రేలు తీస్తూ వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రోగి బరువును పరిశీలించేందుకు వీలుగా ఆమె పడుకున్న మంచానికే తూకపు యంత్రాన్ని బిగించారు.నిరంతరం ఫిజియోథెరపీ చేయడం వల్ల ఆమె సులవుగా ఆహారం తీసుకోవడంతోపాటు మాట స్పష్టంగా వస్తుందని డాక్టర్ ముఫజల్ లక్డావాలా చెప్పారు. మందుల వల్ల శరీరంలో ఉన్న ద్రవపదార్థాల శాతం తగ్గి మరో వందకిలోల బరువు తగ్గుతుందని డాక్టర్ లక్డావాలా వివరించారు. ఈమె చికిత్సకు దాతలు రూ.60 లక్షల రూపాయల దాకా విరాళం అందిందని వైద్యులు వివరించారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







