నాగార్జున ట్వీట్ 'బ్యాక్ టు బిజినెస్' అంటూ
- March 07, 2017
అక్కినేని నాగార్జున ఈ రెండు వారాలుగా ఎంతో ఒత్తిడిని అనుభవించాడు. తను ఎంతో నమ్మకం పెట్టుకున్న 'ఓం నమో వేంకటేశాయ' అతి భారీ డిజాస్టర్గా నిలిచింది. ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ను ప్రపంచవ్యాప్తంగా రూ.36 కోట్లకు అమ్మగా.. కనీసం పదికోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది. ఇక, చిన్న కొడుకు అఖిల్ పెళ్లి రద్దు వ్యవహారం కూడా నాగ్ను బాగా డిస్ట్రబ్ చేసిందనే విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మీడియాకు, సన్నిహితులకు దూరంగా గడిపిన నాగ్.. ఇప్పుడిప్పుడే తన పనులతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం 'రాజుగారి గది-2' షూటింగ్కు హాజరవుతున్నాడు. ఆ షూటింగ్ స్పాట్లో తీసిన ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన నాగ్..
'బ్యాక్ ఇన్ బిజినెస్ విత్ రాజుగారి గది' అని కామెంట్ రాశాడు. ఆ ఫోటోలో నాగ్ ఎంతో హ్యాండ్సమ్ లుక్తో ఉన్నాడు. అయితే అఖిల్ బ్రేకప్ గురించి మాత్రం స్పందించలేదు.
తాజా వార్తలు
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!
- యూఏఈలో విషాదం.. తండ్రి, 7 నెలల శిశువు మృతి, ICUలో తల్లి..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ఒమన్, బెలారస్ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- జాతీయ రైతు బజార్ 13వ ఎడిషన్.. అందరికి ఆహ్వానం..!!
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి