నాగార్జున ట్వీట్ 'బ్యాక్ టు బిజినెస్' అంటూ
- March 07, 2017
అక్కినేని నాగార్జున ఈ రెండు వారాలుగా ఎంతో ఒత్తిడిని అనుభవించాడు. తను ఎంతో నమ్మకం పెట్టుకున్న 'ఓం నమో వేంకటేశాయ' అతి భారీ డిజాస్టర్గా నిలిచింది. ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ను ప్రపంచవ్యాప్తంగా రూ.36 కోట్లకు అమ్మగా.. కనీసం పదికోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది. ఇక, చిన్న కొడుకు అఖిల్ పెళ్లి రద్దు వ్యవహారం కూడా నాగ్ను బాగా డిస్ట్రబ్ చేసిందనే విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మీడియాకు, సన్నిహితులకు దూరంగా గడిపిన నాగ్.. ఇప్పుడిప్పుడే తన పనులతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం 'రాజుగారి గది-2' షూటింగ్కు హాజరవుతున్నాడు. ఆ షూటింగ్ స్పాట్లో తీసిన ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన నాగ్..
'బ్యాక్ ఇన్ బిజినెస్ విత్ రాజుగారి గది' అని కామెంట్ రాశాడు. ఆ ఫోటోలో నాగ్ ఎంతో హ్యాండ్సమ్ లుక్తో ఉన్నాడు. అయితే అఖిల్ బ్రేకప్ గురించి మాత్రం స్పందించలేదు.
తాజా వార్తలు
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్







