నాగార్జున ట్వీట్ 'బ్యాక్ టు బిజినెస్' అంటూ
- March 07, 2017
అక్కినేని నాగార్జున ఈ రెండు వారాలుగా ఎంతో ఒత్తిడిని అనుభవించాడు. తను ఎంతో నమ్మకం పెట్టుకున్న 'ఓం నమో వేంకటేశాయ' అతి భారీ డిజాస్టర్గా నిలిచింది. ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ను ప్రపంచవ్యాప్తంగా రూ.36 కోట్లకు అమ్మగా.. కనీసం పదికోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది. ఇక, చిన్న కొడుకు అఖిల్ పెళ్లి రద్దు వ్యవహారం కూడా నాగ్ను బాగా డిస్ట్రబ్ చేసిందనే విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మీడియాకు, సన్నిహితులకు దూరంగా గడిపిన నాగ్.. ఇప్పుడిప్పుడే తన పనులతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం 'రాజుగారి గది-2' షూటింగ్కు హాజరవుతున్నాడు. ఆ షూటింగ్ స్పాట్లో తీసిన ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన నాగ్..
'బ్యాక్ ఇన్ బిజినెస్ విత్ రాజుగారి గది' అని కామెంట్ రాశాడు. ఆ ఫోటోలో నాగ్ ఎంతో హ్యాండ్సమ్ లుక్తో ఉన్నాడు. అయితే అఖిల్ బ్రేకప్ గురించి మాత్రం స్పందించలేదు.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









