నాగార్జున ట్వీట్ 'బ్యాక్ టు బిజినెస్' అంటూ
- March 07, 2017
అక్కినేని నాగార్జున ఈ రెండు వారాలుగా ఎంతో ఒత్తిడిని అనుభవించాడు. తను ఎంతో నమ్మకం పెట్టుకున్న 'ఓం నమో వేంకటేశాయ' అతి భారీ డిజాస్టర్గా నిలిచింది. ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ను ప్రపంచవ్యాప్తంగా రూ.36 కోట్లకు అమ్మగా.. కనీసం పదికోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది. ఇక, చిన్న కొడుకు అఖిల్ పెళ్లి రద్దు వ్యవహారం కూడా నాగ్ను బాగా డిస్ట్రబ్ చేసిందనే విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మీడియాకు, సన్నిహితులకు దూరంగా గడిపిన నాగ్.. ఇప్పుడిప్పుడే తన పనులతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం 'రాజుగారి గది-2' షూటింగ్కు హాజరవుతున్నాడు. ఆ షూటింగ్ స్పాట్లో తీసిన ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన నాగ్..
'బ్యాక్ ఇన్ బిజినెస్ విత్ రాజుగారి గది' అని కామెంట్ రాశాడు. ఆ ఫోటోలో నాగ్ ఎంతో హ్యాండ్సమ్ లుక్తో ఉన్నాడు. అయితే అఖిల్ బ్రేకప్ గురించి మాత్రం స్పందించలేదు.
తాజా వార్తలు
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన







