బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ తింటున్నారా ? జాగ్రత్త పడమని హెచ్చరిక
- March 07, 2017
బిస్కట్ తింటే జీడిపప్పు ముక్కలో ..బాదంపిస్తా తునకలో రావాలి కానీ ..బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ తింటే ప్రమాదకర లోహపు పలుకులు వచ్చి పంటి పటుత్వానికి సవాలు విసురుతున్నాయి. దీనితో బిస్కట్ల ప్రియులు బెంబేలెత్తుతున్నారు. ఈ దిగుమతి కాబడుతున్న బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ హెల్త్ శాఖ బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ వ్యాప్తి జాడి (380 గ్రాముల) లోలోహపు ముక్కలు ఉంటున్నట్లు నివేదికలు తెలియచేయడంతో దిగుమతి కాబడుతున్న వాటిని వెంటనే నిలుపుదల చేయాలని ఒక ప్రకటనను జారీ చేసింది. ఇటువంటి అన్ని నెలతో విడుదల చేయబడవు ఆ బిస్కెట్ల నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించడం జరిగింది. వారు ఇచ్చిన నివేదికల ప్రకారం అవి ఏమాత్రం మానవ వినియోగం పనికిరావని, వాటిని తినడం వలన ఏ ఒక్కరి ఆరోగ్యం సురక్షితంగా ఉండే అవకాశం లేదని పబ్లిక్ హెల్త్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. యూరోపియన్ ఆహార భద్రత అధికారులు నేపథ్యంలో తయారీదారుని ఉత్పత్తి లో లోహపు ముక్కలు కలిగి ఉండవచ్చని వారు హెచ్చరించారు అదేవిధంగా పబ్లిక్ హెల్త్ శాఖ సైతం హెచ్చరిక చేస్తూ ఫిబ్రవరి 2018 (సంఖ్య 7019109) లో ఈ ఉత్పత్తి ముగుస్తుంది కానీ ఇంకా ఆ బ్యాచ్ కు సంబంధించిన బిస్కట్లు వ్యాప్తి ఉందని కతర్ లో వీటిని పంపిణీ చేసే డీలర్, సంప్రదించి ఆ సరుకుని నిలుపుదల చేస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









