బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ తింటున్నారా ? జాగ్రత్త పడమని హెచ్చరిక
- March 07, 2017
బిస్కట్ తింటే జీడిపప్పు ముక్కలో ..బాదంపిస్తా తునకలో రావాలి కానీ ..బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ తింటే ప్రమాదకర లోహపు పలుకులు వచ్చి పంటి పటుత్వానికి సవాలు విసురుతున్నాయి. దీనితో బిస్కట్ల ప్రియులు బెంబేలెత్తుతున్నారు. ఈ దిగుమతి కాబడుతున్న బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ హెల్త్ శాఖ బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ వ్యాప్తి జాడి (380 గ్రాముల) లోలోహపు ముక్కలు ఉంటున్నట్లు నివేదికలు తెలియచేయడంతో దిగుమతి కాబడుతున్న వాటిని వెంటనే నిలుపుదల చేయాలని ఒక ప్రకటనను జారీ చేసింది. ఇటువంటి అన్ని నెలతో విడుదల చేయబడవు ఆ బిస్కెట్ల నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించడం జరిగింది. వారు ఇచ్చిన నివేదికల ప్రకారం అవి ఏమాత్రం మానవ వినియోగం పనికిరావని, వాటిని తినడం వలన ఏ ఒక్కరి ఆరోగ్యం సురక్షితంగా ఉండే అవకాశం లేదని పబ్లిక్ హెల్త్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. యూరోపియన్ ఆహార భద్రత అధికారులు నేపథ్యంలో తయారీదారుని ఉత్పత్తి లో లోహపు ముక్కలు కలిగి ఉండవచ్చని వారు హెచ్చరించారు అదేవిధంగా పబ్లిక్ హెల్త్ శాఖ సైతం హెచ్చరిక చేస్తూ ఫిబ్రవరి 2018 (సంఖ్య 7019109) లో ఈ ఉత్పత్తి ముగుస్తుంది కానీ ఇంకా ఆ బ్యాచ్ కు సంబంధించిన బిస్కట్లు వ్యాప్తి ఉందని కతర్ లో వీటిని పంపిణీ చేసే డీలర్, సంప్రదించి ఆ సరుకుని నిలుపుదల చేస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!
- జీసీసీ-ఈయూ మధ్య భాగస్వామ్యం బలోపేతం..!!
- బంగారం ధరలు రికార్డ్-హై..!!
- బెలారస్ –ఒమన్ మధ్య పలు ఒప్పందాలు..!!
- మేధోమథనంతో మరింత మెరుగైన సేవలు: సీఎం చంద్రబాబు