బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ తింటున్నారా ? జాగ్రత్త పడమని హెచ్చరిక
- March 07, 2017బిస్కట్ తింటే జీడిపప్పు ముక్కలో ..బాదంపిస్తా తునకలో రావాలి కానీ ..బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ తింటే ప్రమాదకర లోహపు పలుకులు వచ్చి పంటి పటుత్వానికి సవాలు విసురుతున్నాయి. దీనితో బిస్కట్ల ప్రియులు బెంబేలెత్తుతున్నారు. ఈ దిగుమతి కాబడుతున్న బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ హెల్త్ శాఖ బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ వ్యాప్తి జాడి (380 గ్రాముల) లోలోహపు ముక్కలు ఉంటున్నట్లు నివేదికలు తెలియచేయడంతో దిగుమతి కాబడుతున్న వాటిని వెంటనే నిలుపుదల చేయాలని ఒక ప్రకటనను జారీ చేసింది. ఇటువంటి అన్ని నెలతో విడుదల చేయబడవు ఆ బిస్కెట్ల నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించడం జరిగింది. వారు ఇచ్చిన నివేదికల ప్రకారం అవి ఏమాత్రం మానవ వినియోగం పనికిరావని, వాటిని తినడం వలన ఏ ఒక్కరి ఆరోగ్యం సురక్షితంగా ఉండే అవకాశం లేదని పబ్లిక్ హెల్త్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. యూరోపియన్ ఆహార భద్రత అధికారులు నేపథ్యంలో తయారీదారుని ఉత్పత్తి లో లోహపు ముక్కలు కలిగి ఉండవచ్చని వారు హెచ్చరించారు అదేవిధంగా పబ్లిక్ హెల్త్ శాఖ సైతం హెచ్చరిక చేస్తూ ఫిబ్రవరి 2018 (సంఖ్య 7019109) లో ఈ ఉత్పత్తి ముగుస్తుంది కానీ ఇంకా ఆ బ్యాచ్ కు సంబంధించిన బిస్కట్లు వ్యాప్తి ఉందని కతర్ లో వీటిని పంపిణీ చేసే డీలర్, సంప్రదించి ఆ సరుకుని నిలుపుదల చేస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ