బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ తింటున్నారా ? జాగ్రత్త పడమని హెచ్చరిక
- March 07, 2017
బిస్కట్ తింటే జీడిపప్పు ముక్కలో ..బాదంపిస్తా తునకలో రావాలి కానీ ..బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ తింటే ప్రమాదకర లోహపు పలుకులు వచ్చి పంటి పటుత్వానికి సవాలు విసురుతున్నాయి. దీనితో బిస్కట్ల ప్రియులు బెంబేలెత్తుతున్నారు. ఈ దిగుమతి కాబడుతున్న బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ హెల్త్ శాఖ బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ వ్యాప్తి జాడి (380 గ్రాముల) లోలోహపు ముక్కలు ఉంటున్నట్లు నివేదికలు తెలియచేయడంతో దిగుమతి కాబడుతున్న వాటిని వెంటనే నిలుపుదల చేయాలని ఒక ప్రకటనను జారీ చేసింది. ఇటువంటి అన్ని నెలతో విడుదల చేయబడవు ఆ బిస్కెట్ల నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించడం జరిగింది. వారు ఇచ్చిన నివేదికల ప్రకారం అవి ఏమాత్రం మానవ వినియోగం పనికిరావని, వాటిని తినడం వలన ఏ ఒక్కరి ఆరోగ్యం సురక్షితంగా ఉండే అవకాశం లేదని పబ్లిక్ హెల్త్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. యూరోపియన్ ఆహార భద్రత అధికారులు నేపథ్యంలో తయారీదారుని ఉత్పత్తి లో లోహపు ముక్కలు కలిగి ఉండవచ్చని వారు హెచ్చరించారు అదేవిధంగా పబ్లిక్ హెల్త్ శాఖ సైతం హెచ్చరిక చేస్తూ ఫిబ్రవరి 2018 (సంఖ్య 7019109) లో ఈ ఉత్పత్తి ముగుస్తుంది కానీ ఇంకా ఆ బ్యాచ్ కు సంబంధించిన బిస్కట్లు వ్యాప్తి ఉందని కతర్ లో వీటిని పంపిణీ చేసే డీలర్, సంప్రదించి ఆ సరుకుని నిలుపుదల చేస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో కొత్త సముద్ర మార్గంపై ఇరాన్–ఒమాన్ ఒప్పందం దిశగా కీలక పురోగతి
- 2026 తొలి ఆరు నెలల్లో దుబాయ్ ప్రజా రవాణాలో 34.81 కోట్ల ప్రయాణాలు..
- సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో ట్రంప్ కీలక చర్చలు.
- కూటమి సర్కార్ పై జగన్ ఫైర్
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్, జోర్డాన్ రాజులు..
- ఆపదలో అండగా హరీష్ రావు..పేద విద్యార్థిని చదువుకు చేయూత
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక







