బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ తింటున్నారా ? జాగ్రత్త పడమని హెచ్చరిక
- March 07, 2017
బిస్కట్ తింటే జీడిపప్పు ముక్కలో ..బాదంపిస్తా తునకలో రావాలి కానీ ..బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ తింటే ప్రమాదకర లోహపు పలుకులు వచ్చి పంటి పటుత్వానికి సవాలు విసురుతున్నాయి. దీనితో బిస్కట్ల ప్రియులు బెంబేలెత్తుతున్నారు. ఈ దిగుమతి కాబడుతున్న బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ హెల్త్ శాఖ బెల్జియం తయారీ లోటస్ బిస్కట్ వ్యాప్తి జాడి (380 గ్రాముల) లోలోహపు ముక్కలు ఉంటున్నట్లు నివేదికలు తెలియచేయడంతో దిగుమతి కాబడుతున్న వాటిని వెంటనే నిలుపుదల చేయాలని ఒక ప్రకటనను జారీ చేసింది. ఇటువంటి అన్ని నెలతో విడుదల చేయబడవు ఆ బిస్కెట్ల నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించడం జరిగింది. వారు ఇచ్చిన నివేదికల ప్రకారం అవి ఏమాత్రం మానవ వినియోగం పనికిరావని, వాటిని తినడం వలన ఏ ఒక్కరి ఆరోగ్యం సురక్షితంగా ఉండే అవకాశం లేదని పబ్లిక్ హెల్త్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. యూరోపియన్ ఆహార భద్రత అధికారులు నేపథ్యంలో తయారీదారుని ఉత్పత్తి లో లోహపు ముక్కలు కలిగి ఉండవచ్చని వారు హెచ్చరించారు అదేవిధంగా పబ్లిక్ హెల్త్ శాఖ సైతం హెచ్చరిక చేస్తూ ఫిబ్రవరి 2018 (సంఖ్య 7019109) లో ఈ ఉత్పత్తి ముగుస్తుంది కానీ ఇంకా ఆ బ్యాచ్ కు సంబంధించిన బిస్కట్లు వ్యాప్తి ఉందని కతర్ లో వీటిని పంపిణీ చేసే డీలర్, సంప్రదించి ఆ సరుకుని నిలుపుదల చేస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









