కొలంబో రెస్టారెంట్ లో ఎలుక మాంస వంటకాలు..ఆకస్మిక దాడి మూసివేత
- March 07, 2017
అల్ రేయాన్:ఎలుకలను చిన్ని చిన్ని మాంసం ముక్కలుగా కొట్టి..కొలంబో రెస్టారెంట్ లో రహస్యంగా వండి వడ్డిస్తుంటే చవగ్గా మాంసాహారం లభిస్తుందని పలువురు నాన్ వెజ్ ప్రియులు లొట్టలు వేసుకొంటూ తిన్నారు ...వీకెండ్ పార్టీలు స్నేహితులతో కల్సి చేసుకొన్నారు. తీరా తాము తిన్నది ఎలుకుల వేపుడు..మూషికాల బిర్యాని అని తెల్సుకొని ఇపుడు వారంతా తెగ బాధపడిపోతున్నారు. స్థానిక మీసైమీర్ లో ఉన్న ప్రముఖ కొలంబో రెస్టారెంట్ అనారోగ్యమైన ఆహారాన్ని సరఫరా చేస్తుందనే సమాచారంతో అల్ రేయాన్ మున్సిపాలిటీ ఆకస్మిక దాడి చేసి రెండు నెలల పాటు మూసివేశారు. ఇందుకు సంబంధించిన మూసివేత వివరాలు మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ (బాలదియ ) స్మార్ట్ఫోన్ అప్లికేషన్ ద్వారా నవీకరించబడింది. ఈ నిర్ణయం దాదాపు ఒక వారం క్రితం తీసుకోవడం జరిగింది. చిన్న జంతువుల మాంసాన్ని ఆహారంలో కలిపినట్లు మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రచురించిన ఫోటోలు ప్రదర్శించారు. నిజానికి, ప్రజల అంచనాల ప్రకారం చిత్రంలో చూసిన ఫోటోలలో చిన్న ప్రాణులు "ఎలుక" అని గుర్తించారు. మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ సకాలంలో బలమైన చర్య తీసుకోవడంపై కతర్ అంతటా నివాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- 974 బీచ్లో ‘ఫ్లోటీస్ ఫెస్టివల్’.. సందడి చేసేలా ఏర్పాట్లు..!!
- కువైట్లో ప్రవాసులకు లోన్లు మరింత కఠినం..!!
- సౌదీ–ఖతార్లో కొత్త చెల్లింపు సదుపాయం..!!
- ఆర్థిక, ఆర్థిక సహకారం బలోపేతంపై బహ్రెయిన్–సెర్బియా చర్చలు..!!
- టెస్లా కార్లు రీకాల్.. ఎయిర్బ్యాగ్లో సాంకేతిక లోపం..!!
- సుల్తాన్ బోట్స్వానా పర్యటనతో కొత్త పెట్టుబడి అవకాశాలు..!!
- షార్జాలో విషాదం.. ఇంట్లో కుప్పకూలి 32 ఏళ్ల భారతీయ మహిళ మృతి..!!
- పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు..పోలీసు అధికారులతో డీజీపీ కీలక చర్చలు
- అబుదాబిలో యూఏఈ–ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ ఫోరం ప్రారంభం
- మంగినపూడి సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్







