నిబంధనలు ఉల్లంఘిస్తే 200,000 జరీమానా తప్పదు
- March 08, 2017
ఏప్రిల్ నాటికి సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించని పక్షంలో 200,000 దిర్హామ్ల వరకు జరీమానా చెల్లించవలసి ఉంటుందని అధికారిక వర్గాలు హెచ్చరించాయి. అబుదాబీ మునిసిపాలిటీ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముసాఫ్ఫా ఇండస్ట్రియల్లో ముఖ్యంగా పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయనీ, అక్కడ సరైన అకామడేషన్ కల్పించాలని, భద్రతా ప్రమాణాల్ని నిబంధనలకు అనుగుణంగా మార్చవలసి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 6 వరకు పలు సంస్థలకు డెడ్లైన్ విధించారు. ఈలోగా సౌకర్యాలను మెరుగపర్చాలి. లేనిపక్షంలో భారీ జరీమానాలు తప్పవు. ఎప్పటికప్పుడు చేస్తున్న తనిఖీలతో కార్మికుల భద్రతపైనా, వారు పనిచేసే ప్రాంతంలో శుభ్రతపైనా ఉల్లంఘనల్ని గుర్తించి జరీమానాలు విధిస్తున్నామనీ, హెచ్చరికలు జారీ చేస్తున్నామనీ అయినప్పటికీ కొన్ని సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. అందుకే ఇకనుంచి జరీమానాలు భారీ స్థాయిలో విధించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







