నిబంధనలు ఉల్లంఘిస్తే 200,000 జరీమానా తప్పదు
- March 08, 2017
ఏప్రిల్ నాటికి సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించని పక్షంలో 200,000 దిర్హామ్ల వరకు జరీమానా చెల్లించవలసి ఉంటుందని అధికారిక వర్గాలు హెచ్చరించాయి. అబుదాబీ మునిసిపాలిటీ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముసాఫ్ఫా ఇండస్ట్రియల్లో ముఖ్యంగా పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయనీ, అక్కడ సరైన అకామడేషన్ కల్పించాలని, భద్రతా ప్రమాణాల్ని నిబంధనలకు అనుగుణంగా మార్చవలసి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 6 వరకు పలు సంస్థలకు డెడ్లైన్ విధించారు. ఈలోగా సౌకర్యాలను మెరుగపర్చాలి. లేనిపక్షంలో భారీ జరీమానాలు తప్పవు. ఎప్పటికప్పుడు చేస్తున్న తనిఖీలతో కార్మికుల భద్రతపైనా, వారు పనిచేసే ప్రాంతంలో శుభ్రతపైనా ఉల్లంఘనల్ని గుర్తించి జరీమానాలు విధిస్తున్నామనీ, హెచ్చరికలు జారీ చేస్తున్నామనీ అయినప్పటికీ కొన్ని సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. అందుకే ఇకనుంచి జరీమానాలు భారీ స్థాయిలో విధించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









