దయీష్ మద్దతుదారుడి కాల్చివేత
- March 08, 2017
పోలీసు అధికారులు, రియాద్లో దయీష్ మద్దతుదారుడ్ని కాల్చి చంపారు. అల్ రయ్యాన్ డస్ట్రిక్ట్లోని ఓ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో పనిచేస్తున్న కార్మికుడు, తమ సహచరుడొకరు దయీష్ మద్దతుదారుడిగా ప్రకటించుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే నిందితుడు, పోలీసులపైకి పిస్తోల్ ఎక్కుపెట్టాడు. ఈ క్రమంలో అతన్ని కాల్చి చంపవలసి వచ్చిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి మరో వ్యక్తి ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించగా అతన్ని అరెస్ట్ చేశారు. మొత్తం రెండు పిస్తోల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







